బాసుమతి పండించిన రైతులకు శుభవార్త
ఈ సంవత్సరం ఉత్తర భారత దేశం లో బాసుమతి సాగు మరియు దిగుబడి బాగా పెరిగినందువల్ల మరియు ఇరాన్ దిగుమతుల పై తాత్కాలిక నిషేధం విధించినందువల్ల తాత్కాలికంగా రేట్ తగ్గినప్పటికీ ఫెబ్రవరి నుండి ఇరాన్ తమ దిగుమతి నిషేదాన్ని రద్దు చేసుకుంటున్నoదు వల్ల రేట్ పెరిగే అవకాశం ఉంది , ఇరాన్ వినియోగించే దానిలో సగానికి పైగా దిగుమతుల మీద ఆధార పడుతుంది , ప్రతి సంవత్సరం దాదాపు 10 % వినియోగం పెరుగుతోంది , మన దేశంలో కూడా వినియోగం నానాటికి పెరుగుతోంది , గత సంవత్సరం అవసరానికి తగినంత ఉత్పత్తి లేనందువల్ల క్వింటాల్ ధాన్యం ధర 1121 రకం 4000 దాటింది , అందువల్లే పంజాబ్ రైతులు చాలా మంది బాసుమతి వైపు మళ్ళారు , ఈ సంవత్సరం ధర తగ్గటం వల్ల వారు కొంత నిరాశ పడ్డారు ,
బియ్యం వినియోగించని రాష్ట్రాలలో ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొని లెవీ రూపం లో సేకరిస్తుంది 17 % తెమ తో కొని వెంటనే డబ్బు మొత్తం చెల్లించే ఏర్పాటు ఉంది , కనుక ఆ రాష్ట్రాలలో మన లాగా బస్మతిఎతర రకాలకు మార్కెట్ సమస్య లేదు అయెతే బియాన్ని ఆహారంగా వినియోగించే రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణను తగ్గించింది తద్ద్వారా రాబోయే రోజుల్లో ముతక రకాలు పండించే ప్రాంతం లో రైతులకు అమ్ముకోవడం కష్టం అవుతుంది , గత మూడు నాలుగు సంవత్సరాలనుండి ముతక బియ్యం export ధర కిలో 20 నుండి 21 దగ్గరే ఉండి పోయింది ఉత్పత్తి ధర పెరిగినప్పటికీ అంతర్జాతీయంగా ధర తక్కువ ఉన్న రకాలు పండిస్తే రైతులకు మేలు జరగదన్న విషయాన్నీ మేం చాలా సార్లు చెప్తూ వచ్చాము , ఇటీవల APEDA అధ్యక్షలు హైదరాబాద్ లో ఈ విషయం పై చర్చించి ఎగుమతి అవుతున్న బియ్యం టన్ను 400 డాలర్లు ఒక పక్క , మరో పక్క టన్ను 12 నుండి 15 వందల డాలర్లు ( అనగా బాసుమతి ) ఈ వ్యత్యాసాన్ని తగ్గించే విధంగా శాస్త్రవేత్తలు 800 నుండి 1000 డాలర్లు టన్నుకు పలికే నూతన వంగడాలను ప్రవేశపెట్టాలి అని పరోక్షంగా బాసుమతి లాంటి బారు రకాలను ఉద్దేశించి చెప్పారు , కనుక రైతు సోదరులు తమకు లాభసాటిగా ఉండే రకాలను గురించి ఆలోచించాలి
No comments:
Post a Comment