Saturday, 20 December 2014

మొక్కల సాంద్రత దిగుబడి

రైతు  సోదరులకు ..
చాలా మంది  జిగురు గోరుచిక్కుడు  ఎప్పుడు వేస్తె  బాగుంటుంది  అని అడుగుతున్నారు , ఇంతకుముందు  చాలా సార్లు రాసాను , నవంబర్  నెల రైతు నేస్తం  వ్యవసాయ  మాస పత్రికలో నా  వ్యాసాన్ని ప్రచురించారు , మరిన్ని  వివరాలకొరకు  ఆ  ఆర్టికల్  చదవగలరు

ఈ పంటను   జనవరి నేలాఖరిలోగా  వెయ్యగలరు , చాలా మంది రైతులు   దిగుబడి  ఎంత వస్తుంది అని అడుగుతున్నారు,  దీనికి  ప్రతి  మొక్క      కనీసం  10 గుత్తులు  కాస్తే  గుత్తికి  ఏడు   కాయలు  , కాయికి   7  గింజలు (10 x 7 =70 x 7 =490 గింజలు ) ప్రతి ముప్ఫై  గింజలు  ఒక గ్రాము , ఈ విధంగా  ఒక మొక్క  షుమారు  16  గ్రాములు  గింజలను పండించ  గలిగితే  ఎకరానికి  ఒక లక్ష  మొక్కలు  ఉండే విధంగా  విత్తుకోగలిగితే  ఎకరానికి  16  క్వింటాళ్ళ  దిగుబడి సాదించవచ్చు , దీని బట్టి  మనం  తెలుసుకునే  ముఖ్య విషయం ఏంటి అంటే , పొలం లో విత్తే టప్పుడు  మొక్కల సాంద్రత  సరిపడా ఉండేటట్టు  చూసుకుంటే  రైతుకు  మంచి దిగుబడి సాదించడానికి  అవకాశం ఉంటుంది 

No comments:

Post a Comment