Monday, 1 December 2014

Fall in paddy prices and basmati 1509 farmers , Iran temporary export ban

వరి  పండించే  రైతు సోదరులారా  ఆలోచించాలి :
ప్రభుత్వం  వద్ద  దాదాపు  3.5  కోట్ల  టన్నుల  బియ్యం నిల్వ  ఉండటం  , లెవీ సేకరణ  విధానంలో  కేంద్ర ప్రభుత్వం  తీసుకుంటున్న  నిర్ణయాల వల్ల  వరికి గిట్టుబాటు  ధర  సమస్యగా  మారింది , కనుక  ఉత్పత్తి కర్చును  తగ్గించే  విధానాలపై  దృష్టి సారించడం  సాధ్యమైనంత  వరకు  వరికి  ప్రత్యామ్నాయ  పంటల వైపు  మారటం , భూగర్భ జలాలతో  వరిని  పండించక పోవడమే  మేలు , ప్రత్యామ్నాయంగా  జిగురు  గోరుచిక్కుడు , పప్పు గింజలు , తెల్ల నువ్వులు  లాంటి  పంటలు పండించడం  లాభదాయకం  కాగలదు .

ప్రభుత్వ  పధకాల  ద్వారా , అతి తక్కువ ధరకు  ఇస్తున్న బియ్యం  తిరిగి మార్కెట్ లోకే  రావడం , నానాటికి తగ్గుతున్న బియ్యం వినియోగం , అంతర్జాతీయంగా  కూడా  బియ్యం ఉత్పత్తి  పెరగటం  లాంటి  కారణాల వల్ల  బాసుమతి యేతర  బియ్యానికి  పెద్దగా   ధర వచ్చే అవకాశాలు కనపడటం లేదు , ఎగుమతికి  బాగా అవకాశం ఉన్న , మంచి ధర రాగలిగిన  గింజ పొడవు రకాలైన  పూసా 1509 , 1121  లాంటి రకాల  సాగు  వల్ల  ఉత్పత్తి  కర్చుకన్నా  రెట్టింపు    ధర  పొందగలిగే  పై రకాలను  సాగు చేసినందువల్ల  రైతులు  లాభ పడగలరు .

అతి పెద్ద  బాస్మతి  బియ్యం  దిగుమతి  చేసుకునే  దేశం  ఇరాన్ , తాత్కాలిక  దిగుమతి  నిషేధం  వల్ల  ధరలు  కొంత తగ్గినప్పటికీ   ఫెబ్రవరి  నుండి  బాసుమతి  ధరలు  పెరిగే  అవకాశం  ఉన్నది , కనుక  బాసుమతి పండించిన రైతులు  నిరాశ  చెందనవసరం  లేదు  

ఉత్పత్తి కర్చు తగ్గించే  విధానం :
దాళ్వా లో  దమ్ము చేసి  నేరు గా మొలక కట్టిన విత్తనాన్ని చల్లటం , బాస్పరపు  ఎరువు సింగల్ సూపర్ ఫాస్ఫేట్  రూపంలో ఇవ్వడం.

దాళ్వా  లో  తప్పనిసరిగా  జింక్  సల్ఫేట్  వాడటం .

urea  పోటాష్ లను  సగం మోతాదు ,మొలకెత్తిన  15 వరోజు  మిగిలిన  సగాన్ని  30 వరోజు urea  పోటాష్ అంతే మోతాదు  vermi compost    లో కలిపి  24  గంటలు   తరవాత   చల్లాలి , కలుపు నివారణకు  కలుపు మందులనే  వాడండి .
ఈ విధంగా చేస్తే  ఉత్పత్తి  ఖర్చు  సాధ్యమైనంత వరకు  తగ్గించ వచ్చు 

విత్తన  శుద్ధిని  మరవవద్దు      


No comments:

Post a Comment