12.12.2014
రైతు
సోదరులారా
ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తుల
ధరలు తాత్కాలికంగా తగ్గుదలలో ఉన్నాయి , కారణాలు ధాన్యం
ధర తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం లెవీ
విధానంలో తీసుకున్న మార్పులు , ప్రభుత్వం
వద్దే దాదాపు 3.5
కోట్ల టన్నులు బియ్యం
నిలువ ఉండడం , పేదలకు ఇచ్చే రూపాయి
రెండు రూపాయిలు కి ఇచ్చే బియ్యం తిరిగి మార్కెట్లోకే రావడం , ఇలాంటి కారణాల వల్ల
ముతక బియ్యం ధరలు తగ్గే అవకాశాలు
ఉన్నాయి , అయెతే సన్న బియ్యం అనగా
సోనా మసూరి , సాంబ మసూరి BPT , జై
శ్రీ రాం , బాస్మతి లాంటి
బియ్యానికి కూడా ధరలు తగ్గించి
కొనుక్కోవడానికి వ్యాపార
వర్గాలు చేస్తున్న ప్రయత్నమే
కాని మరొకటి కాదు , కనుక
మంచి డిమాండ్ ఉన్న పై రకాలను తక్కువ ధరలకు అమ్మవద్దు ,
ఇప్పటికే ఈ వారంలో జై
శ్రీ రాం రకం ధాన్యం ధర తగ్గి
మళ్ళి పెరుగుతుంది , ఆ రకం ధాన్యం ముందుగా మార్కెట్లోకి రావడం వల్ల రైతు
సోదరులు అందరు ఎక్కువ శాతం అమ్మేసుకున్నారు , అయెతే ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి , సకాలం వర్షాలు
లేకపోవడం తరువాత తుఫాన్లు , అధిక వర్షాలు తెగుళ్ళు
మొదలైన సమస్యలతో గత సంవత్సరం దాదాపు
10.5 కోట్ల టన్నులు బియ్యం
ఉత్పత్తి జరగగా ఈ సంవత్సరం 9
కోట్ల టన్నులే ఉండవచ్చు
అని ముందస్తు అంచనాలు
చెప్తున్నాయి , కూలీల కొరత ఎరువుల ధరల పెరుగుదల సకాలం లో పెట్టుబడులు అందక అధిక వడ్డిలకు
రైతులు అప్పులు చేసి , తగ్గిన ధాన్యం ధరల వల్ల
తీవ్ర నష్టాలకు గురై నిరాశతో
ఉన్నారు . అయెతే ప్రస్తుత తరుణంలో రైతు ఉత్పత్తి కర్చులను
తగ్గించే దిశగా ఆలోచించాలి , స్వల్ప కాలిక
రకాలు తక్కువ ఎరువులతో , తక్కువ కర్చుతో
ఎక్కువ దిగుబడినిస్తున్న నూతన విధానాలు అనగా
విత్తనాన్ని నేరుగా విత్తడం ,
దమ్ము చేసిన చేలో వెదజల్లటం అవసరమైన
మేరకే ఎరువులను వాడటం , అవసరానికన్నా
ఎక్కువ ఎరువులను వాడి ఎక్కువ దిగుబడులను తియ్యొచ్చు అనే అపోహలనుండి బైటకు రావాలి , వరి సాగు లో ఎకరానికి
కర్చు పది నుండి
15 వేలు పెడుతున్న రైతులు ఒక వైపు , 25 నుండి 30 వేలు కర్చు పెడుతున్న
రైతులు ఒక వైపు కనిపిస్తున్నారు , అయెతే దిగుబడి మాత్రం
35 నుండి 40 బస్తాలు
సరాసరి దిగుబడి మాత్రమే వస్తుంది , అధిక ఉత్పత్తుల ప్రయత్నం వల్ల అత్యదిక కర్చులు పెట్టి రైతు నష్టపోవడం జరుగుతుంది కనుక రైతు సోదరులంతా తప్పనిసరి పోలాలలో మాత్రమే వరిని పండించే ప్రయత్నం చెయ్యండి , నానాటికి దేశంలో మధుమేహ
రోగులు పెరుగుతున్న ఈ తరుణంలో
బియ్యం తలసరి వినియోగం
తగ్గుతూ వస్తుంది , ఇది ప్రపంచ
వ్యాప్తంగా వస్తున్న మార్పు కనుక రైతు సోదరులందరూ దిన్ని గమనించి ధాన్యం
ఉత్పత్తి కర్చును చేతనైనంత వరకు తగ్గించాలి , అలాగే ప్రతి రైతు
తప్పని సరిగా మన మన మాతృభాషలలో
వస్తున్న వ్యవసాయ మాస పత్రికలను తప్పనిసరిగా
కొని చదువుతూ అవగాహనను
పెంచుకోవచ్చు
No comments:
Post a Comment