Thursday, 11 December 2014

తగ్గిన ధాన్యం ధరలు

12.12.2014

రైతు  సోదరులారా
 ప్రస్తుతం వ్యవసాయ  ఉత్పత్తుల  ధరలు  తాత్కాలికంగా  తగ్గుదలలో ఉన్నాయి , కారణాలు  ధాన్యం  ధర తగ్గడానికి  కేంద్ర ప్రభుత్వం  లెవీ  విధానంలో తీసుకున్న మార్పులు , ప్రభుత్వం  వద్దే  దాదాపు  3.5  కోట్ల  టన్నులు  బియ్యం  నిలువ  ఉండడం , పేదలకు  ఇచ్చే రూపాయి  రెండు రూపాయిలు కి ఇచ్చే బియ్యం తిరిగి మార్కెట్లోకే  రావడం , ఇలాంటి  కారణాల వల్ల  ముతక బియ్యం ధరలు  తగ్గే  అవకాశాలు  ఉన్నాయి , అయెతే  సన్న బియ్యం అనగా సోనా మసూరి , సాంబ మసూరి  BPT , జై శ్రీ  రాం , బాస్మతి  లాంటి  బియ్యానికి  కూడా  ధరలు తగ్గించి  కొనుక్కోవడానికి  వ్యాపార వర్గాలు  చేస్తున్న  ప్రయత్నమే  కాని  మరొకటి  కాదు , కనుక  మంచి  డిమాండ్  ఉన్న పై రకాలను తక్కువ ధరలకు అమ్మవద్దు , ఇప్పటికే  ఈ వారంలో  జై  శ్రీ రాం  రకం ధాన్యం ధర  తగ్గి  మళ్ళి పెరుగుతుంది , ఆ రకం ధాన్యం ముందుగా మార్కెట్లోకి రావడం వల్ల  రైతు  సోదరులు అందరు  ఎక్కువ శాతం  అమ్మేసుకున్నారు , అయెతే  ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి , సకాలం వర్షాలు లేకపోవడం  తరువాత  తుఫాన్లు , అధిక వర్షాలు  తెగుళ్ళు  మొదలైన  సమస్యలతో గత సంవత్సరం  దాదాపు  10.5  కోట్ల టన్నులు  బియ్యం  ఉత్పత్తి  జరగగా ఈ సంవత్సరం  9  కోట్ల  టన్నులే  ఉండవచ్చు  అని   ముందస్తు  అంచనాలు  చెప్తున్నాయి , కూలీల కొరత ఎరువుల ధరల పెరుగుదల  సకాలం లో పెట్టుబడులు అందక అధిక వడ్డిలకు రైతులు అప్పులు చేసి , తగ్గిన ధాన్యం ధరల వల్ల  తీవ్ర నష్టాలకు  గురై  నిరాశతో  ఉన్నారు . అయెతే  ప్రస్తుత  తరుణంలో రైతు ఉత్పత్తి  కర్చులను  తగ్గించే దిశగా ఆలోచించాలి , స్వల్ప కాలిక  రకాలు తక్కువ ఎరువులతో , తక్కువ కర్చుతో  ఎక్కువ దిగుబడినిస్తున్న  నూతన  విధానాలు అనగా  విత్తనాన్ని  నేరుగా విత్తడం , దమ్ము చేసిన చేలో  వెదజల్లటం  అవసరమైన  మేరకే  ఎరువులను వాడటం , అవసరానికన్నా ఎక్కువ ఎరువులను వాడి ఎక్కువ దిగుబడులను తియ్యొచ్చు  అనే అపోహలనుండి  బైటకు రావాలి , వరి సాగు లో  ఎకరానికి  కర్చు  పది  నుండి  15 వేలు పెడుతున్న రైతులు ఒక వైపు , 25 నుండి 30 వేలు కర్చు పెడుతున్న రైతులు  ఒక వైపు  కనిపిస్తున్నారు , అయెతే దిగుబడి  మాత్రం  35  నుండి 40  బస్తాలు  సరాసరి  దిగుబడి  మాత్రమే వస్తుంది , అధిక  ఉత్పత్తుల ప్రయత్నం వల్ల  అత్యదిక కర్చులు పెట్టి రైతు  నష్టపోవడం జరుగుతుంది కనుక రైతు సోదరులంతా  తప్పనిసరి పోలాలలో  మాత్రమే వరిని పండించే  ప్రయత్నం చెయ్యండి , నానాటికి దేశంలో మధుమేహ రోగులు  పెరుగుతున్న  ఈ తరుణంలో  బియ్యం తలసరి వినియోగం  తగ్గుతూ  వస్తుంది , ఇది ప్రపంచ వ్యాప్తంగా  వస్తున్న మార్పు  కనుక రైతు సోదరులందరూ  దిన్ని గమనించి  ధాన్యం  ఉత్పత్తి కర్చును  చేతనైనంత  వరకు తగ్గించాలి , అలాగే  ప్రతి రైతు  తప్పని సరిగా  మన మన  మాతృభాషలలో  వస్తున్న  వ్యవసాయ మాస పత్రికలను   తప్పనిసరిగా  కొని  చదువుతూ  అవగాహనను  పెంచుకోవచ్చు


No comments:

Post a Comment