Saturday, 31 January 2015

రైతు సోదరులకు

రైతు  సోదరులారా ...
ఆహార ధాన్యాల  నిలువలు  దేశంలోనూ  విదేశాలలోనూ  ఇబ్బడి  ముబ్బడి గా  నిలువలు ఉండటమే కాక , ఈ సంవత్సరం  అన్ని దేశాలలో పంటలు కూడా బాగా పండటం ఒక  కారణమైతే,  ప్రపంచవ్యాప్తంగా   ఆహార వినియోగం  పై  పెరిగిన  అవగాహన  వల్ల , ఆహార ధాన్యాలతో పాటు పళ్ళు  కూరగాయలు   మాంసం  గ్రుడ్లు  పాలు  మొదలైన అత్యంత  పోషక  విలువలు   కలిగిన  ఆహరం వినియోగం  పెరగడం వల్ల  ఆయా పదార్తలా  విలువలు  పెరిగి  ఆహార ధాన్యాల  వినియోగం తగ్గుతూ  వాటి ధరలు   మందకొడిగా  ఉంది , ఉదాహరణకు  గత సంవత్సరం  బాస్మతి  బియ్యంతో  సమాన విలువ  కలిగిన  గొడ్డు మాంసం  మన దేశం నుంచి ఎగుమతి  అయ్యింది , కనుక రైతు సోదరులు  కూడా  వ్యవసాయం లో  routine  గా  పండించే పంటలే  కాకుండా  ప్రపంచ  ప్రజల మారిన  ఆహారపు  అలవాట్లకు అనుగుణంగా  రైతు సోదరులు  తమ పంట విధానాలను  మార్చుకుంటే  వ్యవసాయం  లాభసాటి  కాగలదు.
గత   సంవత్సరం  మన దేశం నుండి  కూరగాయలు  పళ్ళు  8760  కోట్ల  రూపాయల  విలువైన  ఎగుమతులు  చేసారు , వాటిలో  పళ్ళు   3300  కోట్లు  అదే కూరగాయిలైతే  5460  కోట్ల  రూపాయల ఎగుమతులు  చెయ్యగలిగాం  పళ్ళలో  మామిడి , ద్రాక్ష . అరటి , దానిమ్మ  మొదలైనవి దేశం లో వినియోగించటమే  కాక విదేశాలకు  కూడా  ఇంకా ఎగుమతులు పెంచవచ్చు , నాణ్యత ఇంకా పెంచగలిగితే ఇంకా ఎక్కువ ధర పొందవచ్చు , అదే కూరగాయిలతే బెండ  పచ్చి మిర్చి కాకరకయిలు  పుట్టగొడుగులు , బంగాళా దుంపలు లాంటి నాణ్యమైన  కూరగాయలకు  అమెరికా , బ్రిటన్ , జర్మనీ , సింగపూర్ , రష్యా , కువైట్ , నేపాల్ , బంగ్లాదేశ్ , అరబ్ దేశాల కూటమి  U A E , సేంద్రియ  పద్దతులలో  పండించిన  ఆహార పదార్థాలకు దేశ విదేశాలలో  మంచి గిరాకి ఉన్నందున  రైతులు  ఆ పద్ధతులను అవలంభించి  పంటలు  పండిస్తే  మంచి  ఆకర్షణీయమైన ధరలు పొందవచ్చు.

గతం లో మన  కూరగాయల ధరలు  సీజన్ ని బట్టి  ధరలు తగ్గటం పెరగటం  చూసే వాళ్ళం  , ప్రస్తుతం టమాటో మరియు ఉల్లిపాయ  ఈ రెండిటిలోనే  ఈ పరిసితిని  ఎదుర్కొంటున్నాం , అయెతే శీతల  గిడ్డంగులు  అందుబాటు లోకి  తేవడం ,  విలువ వృద్ది  చేసే  విభిన్నమైన  పద్ధతులు  రైతుకు అందుబాటులోకి తేవడానికి  కేంద్ర ప్రభుత్వం   ఫుడ్ పార్క్ లను స్థాపిస్తుంది , ఉత్సాహవంతులైనటువంటి  యువ రైతులు ఈ నూతన  విధానాలను  ఆచరించి  వ్యవసాయాన్ని  లాభసాటిగా  మార్చి  ఇతర రైతులకు  ఆదర్శంగా నిలవాలి , అలా కాని పక్షంలో  వ్యసాయం కూడా  విదేశీ పెట్టుబడిదారుల చేతిలోకి  వెళ్ళే రోజు  దగ్గరలోనే  ఉంది .


                                                          ఇట్లు  మీ  .....K  V  K  

Saturday, 17 January 2015

కృషితో నాస్తి దుర్భిక్షం


ఒకప్పుడు  చలిలో   వరి పండదు   అనేది  రైతుల  అనుభవం , అయెతే  శాస్త్రవేత్తల నిరంతర శ్రమ  ఫలితంగా  ఎప్పుడు  నాటినా మంచి  దిగుబడులు  వస్తాయి  అనేదానికి  నిదర్శనమే  పై   ఫోటోలు  , ఇంకా  కోతకు  రాని ఈ పంట  సముద్రపు  వడ్డున  కోడూరు  మండలం నరసింహాపురం  గ్రామం లో డాక్టర్  M  కోటేశ్వర్ రావు గారు  పండించి  నిరూపించిన   పంట  చేను .   18.1.2015 , వివరాలకు   డాక్టర్ గారిని  సంప్రదించవచ్చు  09440368801

IVRI , INDIAN VETERINARY RESEARCH INSTITUTE DIRECTORS FOR THE PAST 125 YEARS

INDIAN VETERINARY RESEARCH INSTITUTE  DIRECTORS FOR THE PAST 125 YEARS , SOURCE : PUSA MAGAZINE 

Friday, 16 January 2015

శుభవార్త

ఈ  సంవత్సరం   పప్పు  పంటల  దిగుబడి   బాగా  తగ్గే  అవకాశం  కనపడుతోంది  కనుక  మిత్రులారా   మీరంతా  వేసవి  పంటగా  పెసర  మినుము  లాంటి   పంటలతోపాటు నూనెగింజల పంటగా   తెల్లనువ్వులు పండిస్తే   మంచి ధర   వస్తుంది  గత   మూడు  సంవత్సరాల నుండి   మంచి  ధర క్వింటాల్   పది వేల  రుపాయలు పైనే ఉంటున్నది    ఈ పైరు కు పశువుల బెడద కూడా ఉండదు   విదేశాలకు ఎగుమతి   అవకాశమున్న ఈపంటవల్ల ఇటు రైతులకు  అటు ప్రభుత్వానికి   కూడా లాభ ప్రదం   కనుక మిత్రులారా    వేసవిలో   పై పంటలను  పండిస్తే   వ్యవసాయం  లాభ సాటిగా   వుంటుంది
   మరో ముఖ్యవిషయం హైబ్రిడ్ తప్ప మిగతా అన్నిరకాల    విత్తనాలను మీరే స్వంతంగా సేకరించుకుంటే    విత్తనాలను    గురించి   సాధారణంగా  మీరు ఎక్కువ ధరపెట్టి   నాసిరకం  కొనే భాదుండదు     చాలా చాలా మంది రైతులలో  ఒక అపొహ్ వుంది   బ్రాండ్ విత్తనాలే మంచివి అని  కానీ మీరు   శ్రద్ధగా గమనిస్తే   మన వారంతా   వారి  వారి విత్తనాన్ని   వారె నిల్వ చేసుకునే   వారు   ఏదైనా ఒక విత్తనాన్ని    కొత్తగా రూపొందించే   వరకే శాస్త్ర వేత్తల పని    అంతే గాని ఆ తరువాత   జరిగేదంతా మనలాంటి   రైతుల ద్వారానే అనేవిషయంపై   మీకు సందేహం   అవసరం లేదు   ఈనాడు ఎంతోమంది   విద్యావంతులు  ఈ రంగములో కాలుపెట్టి కొద్ది రోజులలోనే  కోట్లాది రూపాయల ఆదాయం పొందేరు   మీరుకూడా   కనీసం   మీకు  మీప్రక్క  రైతులకూ   చేయూతనిచ్చేందుకు  ప్రయత్ని చండి  
                                              




                                                    జై  హింద్

Thursday, 15 January 2015

పండగ సంతోషం

ఆత్మీయులు  అయన రైతు   మిత్రులకు కే  వీ  కే    నమస్కారములు మీరంతా  కులాసా  అని  తలుస్తాను 
 నిన్న సంక్రాంతి పండు గా బాగాజరుపుకున్నారని   తలుస్తాను   పండుగకు మనవారంతా  ఊరికి వచ్చనారని   తలుసు కుని   ఎంతో ఆనందం కలిగింది  నేను కూడా వచ్చే పండుగానాటికి  తప్పకవస్తాను   సెలవు   

               ఇట్లు మీ కృష్ణా రావు    16/1/2015

Tuesday, 13 January 2015

Kind attention to farmers

DEAR FARMER FRIENDS , WE HAVE  BEEN PURCHASING  GUAR SEED FROM THE PAST  18 MONTHS FROM OVER 1200 FARMERS AND ALMOST 99% OF THE PAYMEMTS ARE MADE TO THE FARMERS BANK ACCOUNTS DIRECTLY , AMD THAT TOO AT JODHPUR MANDI PRICE , THIS HAS IRKED SOME TRADERS WHO WERE EARLIER PURCHASING THE GUAR SEED FROM FARMERS AT THROW AWAY PRICE , AND OUR PLANT AND PURCHASES HAVE DISSAPPOINTED THEM A LOT AND THUS THEY ARE INDULGING IN FALSE PROPAGANDA , AND SINCE WE HAVE RICE MILLS , FLOUR MILLS APART FROM GUAR GUM PLAT , WE RECEIVE ALMOST HUNDREDS OF CALLS AND IT IS BECOMING IMPOSSIBLE FOR  US To RECEIVE ALL THE CALLS THEREFORE I REQUEST FARMERS TO KINDLY SEND SMS to 09480431111 OR EMAIL FOR THE REQUIRED HELP OR ANY SERVICE REQUIRED FROM US OUR EMAIL : vishwashantiagro@gmail.com

Sunday, 11 January 2015

Impact on farmers of the fall in crude prices



Barrel  ముడి చమురు 120  డాలర్ల  నుండి  50 డాలర్లకు  తగ్గడం తో చాలా  మంది సంతోషాన్ని  వ్యక్తం  చేస్తున్నారు  , అయెతే  ఈ తగ్గుదల  తరువాత  రాబోయే  పరిణామాల గురించి ఆలోచిస్తే  భయం  వేస్తుంది , ముడి చమురు ఉత్పత్తి  చేసే దేశాలలో  చాలా దేశాలు ఆహార పదార్థాల దిగుమతి మీద ఆధార పడిన దేశాలే , ఈ దేశాలలో  ఆర్ధిక సంక్షోబం  తలెత్తితే పరోక్షంగా  ఆ ప్రభావం  మన దేశం పైనా  , ముఖ్యంగా మన  రైతుల పైనా  పడక  తప్పదు.
ఈ ముడి చమురు ఉత్పత్తి చేసే  OPEC  దేశాలలో  40 %  ఉత్పత్తి వారిదే , అమెరికా  22 % , రష్యా  13 % మరియు  ఇతర చిన్న చిన్న దేశాలు  ఉత్పత్తి   చేస్తున్నాయి  , వీటిలో  ఇరాన్  రష్యా , లిబియా , వెనిజులా  లాంటి దేశాలు   ఇప్పటికే  ఆర్ధిక  సంక్షోబంలో  పడినట్టు  తెలుస్తుంది , దీని  ప్రభావం తో మన   దేశాల నుంచి దిగుమతి చేసుకునే   ఆహార   పదార్థాలపై     కూడా ప్రభావం  పడింది , దీనితో  రైతుల    పరిస్తితి  మూలిగే  నక్కపై  తాటికాయ పడినట్లు  మన  వ్యవసాయ  పదార్థాల   ఎగుమతులు   తగ్గితే  అంతంత  మాత్రంగా  ఉన్న ధరలు  ఇంకా తగ్గే అవకాశం  ఉంది , కనుక   రైతు   సోదరులు  తమ పంటల  ఉత్పత్తి  కర్చులను  సాధ్యమైనంత  తగ్గించగలిగితే  లాభాల  మాట ఎలా ఉన్నా  అప్పుల ఊబిలో  కూరుకు పోకుండా  ఉండగలరు , ఇప్పటికే దేశంలో  5 ఎకరాల కన్నా తక్కువ భూమి కలిగిన  80  % రైతులు అప్పుల   పాలై   ఉన్నారు.



ఆహార పదార్థాల  ధరలు  ఎ మాత్రం  పెరిగినా ప్రతిపక్షాలు , పత్రికలు  తమ ప్రచార   సాధనంగా  వాడుకుంటున్నాయి కాని  వాస్తవాలను  ప్రజలకు  తెలియజేయ్యడంలో  విఫలమవుతున్నారు , ప్రతి సారి  దళారులను  సాకుగా  చూపి  ధరల పెరుగుదలను  గోరంతను  కొండంతగా  చేసి  ప్రజలను  తప్పుదారి  పట్టిస్తున్నారు , కేవెలం కొన్ని ప్రాంతాలలో  పండే  పంటలు  వందల కిలోమీటర్ల   దూరాన  ఉన్న   ప్రజలకు    అందించవలిసిన  పరిస్తితులు  , కర్చులు కూడా కలపవలిసి   ఉంటుంది  , ఈ ఆహార పదార్థాలను ఈ దేశంలో  ఉన్న  నలుదిక్కులకు  సరఫరా  చేసే పనిలో  కొన్ని కోట్ల మందికి  ఉపాధి  కూడా ఉందనే  విషయాన్నీ  మర్చిపోరాదు , ప్రతిపక్షాలు అధికార పక్షం లో ఉన్నప్పుడు  వారికి  ఈ సమస్య  అనుభవమే  కనుక ప్రజలను  గందరగోళ పరిచే  ఇలాంటి ప్రచారాల వల్ల  ఇటు ఉత్పత్తి  దారుడు   అటు వినియోగ దారులు  కూడా  ఆందోళన చెందాల్సిన  పరిస్తితి  కలుగుతుంది .భారత దేశంలో కొన్ని పదార్థాలు  సంవత్సరం  పొడవునా  పండవు కనుక వాటిని  నిలువ  ఉంచాల్సిన  పరిస్తితి  ఉంది , ఈ పని ఎవరు చెయ్యాలి  ?
ప్రభుత్వం  బియ్యాన్ని  FCI  ద్వారా నిలువ  చేసిన సందర్భాలలో  వేల కోట్ల రూపాయిలు  నష్టం జరుగుతుంది , ఇలాంటి  సమయం  లో  మనం  నిలువదారులను  వ్యాపారస్తులను భయబ్రాంతులకు  గురిచేస్తే  పరోక్షంగా  నష్టపోయేది  రైతే , ఈ  విషయాన్నీ  విజ్ఞ్యులు  అంతా  గమనించాలీ  

Friday, 9 January 2015

grafted mango plant / Tree

మామిడి పండు  కోసం  ఇప్పుడు  సంవత్సరాల తరబడి  ఆగాల్సిన అవసరం  లేదు , ఎంత తక్కువ స్థలం లో అయినా మీ పెరట్లో కాపుకు సిద్దమైన  మొక్కలను  మనకందించే  సౌకర్యం  ఇప్పుడు మన ముందు  ఉంది , ఎక్కువ స్థలం లేదని  నీటి లభ్యత లేదని సందేహించాల్సిన అవసరం  లేకుండా  తీయ్యని  పళ్ళను  అందించే   ఈ మామిడి మొక్కను మన ఇంటి  వద్దే  పెంచుకోవచ్చు   

Sunday, 4 January 2015

cassia tora

ఇదే  కాసియా  తోరా  మొక్క , ఇది ఒక కలుపు  జాతి  మొక్క  , దీనిని  మేకలు  పశువులు  ఏవి  తినవు , అయెతే ఇది చాలా విలువైన  గింజ , మన దేశం  నుంచి   చైనా  మొదలైన  దేశాలకు  ఎగుమతి   చెయ్యవచ్చు  , క్వింటాల్  ధర  1500  నుండి  4000  వరకు  ఉంటుంది     


Thursday, 1 January 2015

various Paddy varieties Grown by sri Dr M.Koteshwar rao , MBBS , in his fields at Narasimhapuram Village, Koduru mandalam, Krishna Dist, , Andhrapradesh, India

MTU 1166 

PUSA PUNJAB BASMATI 1509

NLR SWETHA

NLR 34449

RNR 15048
వ్యవసాయం  అంటేనే  యువతను  భయపెడుతున్న  ప్రస్తుత  తరుణంలో   డాక్టర్ గా   వారి  సేవలను అందిస్తూనే  వంశ పారంపర్యంగా   వచ్చిన  వ్యవసాయాన్ని  చేస్తూ  మూస  పద్దతిలో  కాకుండా తన  వ్యవసాయ  క్షేత్రాన్ని   పరిశోధనా  కేంద్రంగా  మార్చి  అందరు  BPT  లాంటి  రకాల్నే  సాగు  చేస్తూ  వేరే  రకాల  సాగు చేపట్టడానికి  భయపడుతున్న  ప్రస్తుత  తరుణం లో,  బంగాళా ఖాతం  సముద్రానికి  అతి సమీపం లో ఉన్న   తన క్షేత్రంలో  అందరిలాగానే  సమస్యలను  ఎదుర్కుంటూ  నూతన  వంగడాలు  అతి  తక్కువ కర్చుతో  పంట  దిగుబడి ని  పెంచుతూ  వ్యవసాయాన్ని  లాభసాటిగా  మార్చుతూనే  మరో ప్రక్క ఎంతో దూర ప్రాంతాలనుండి  తనవద్దకు వచ్చే రోగులకు   అతి తక్కువ  కర్చుతోనే   వైద్య   సేవలను   అందిస్తూ   సమాజానికి  ఎనలేని  సేవల్ని  అందిస్తున్న   ఈ  సవ్య  సాచి  యువతకు   మార్గదర్శి