Wednesday, 30 July 2014

విచేక్షణారహితంగా ఎరువులు పురుగు మందులు వాడకం ... రైతుల మరియు వినియోగదారుల ఆర్ధిక / ఆరోగ్యానికి నష్టం



31 .7 .2014 

 రైతు మిత్రులారా 

 జూన్, జులై లో మూడు  వారాలు  వర్షాభావ  పరిస్తితి  నెలకొని  తొలకరి  మెట్ట పంట దేశం మొత్తం మీద  25 % కూడా  సాగు కాలేదు  ఇందువల్ల  చిరు ధాన్యాలు  పప్పు గింజలు  నూనె   గింజలు  కూరగాయల కొరత ను ఎదుర్కొంటున్నాం , జులై ఆఖరి  వారం లో దేశం  మొత్తం మీద  మంచి  వర్షాలు  పడటం తో  దాదాపు  దేశం లో ఉన్న షుమారు  85  డాం లలో  నీరు  గణనీయంగా  పెరుగుతోంది  దీన్ని సద్వినియోగం  చేసుకుని   ఖరీఫ్  వరి  రబీ  లో నూనె  గింజలు  పప్పు  ధాన్యాలు  కూరగాయలు  సాగు చేసుకున్నందువల్ల  దేశం అవసరాలు  తీర్చటమే  కాకుండా  రైతులు  కూడా లాభపడగలరు


ఎక్కువ నీరు అవసరమైన  వరి  పండిస్తూ  ఎక్కువ  శాతం  రైతులు  నష్టపోతున్నారు  కారణం   అవగాహన  లేకుండా  అధికంగా  ఎరువులు  వాడటం , తద్ద్వారా  వచ్చే పురుగులు  తెగుళ్ల  నివారణకు   క్రిమిసంహారకాలు  వాడవలసి రావటం వల్ల  కర్చు విపరీతంగా పెరిగి  , వరి రైతు  ఆర్ధిక  దుస్స్థితి  లో ఉన్నాడు , విచేక్షణా  రహితంగా   బాస్వరపు  ఎరువులు  అవసరానికన్నా  బాగా ఎక్కువ   వాడటం  జరుగుతుంది కనుక  సేంద్రియ  వ్యవసాయం లోకి  మారినట్లయితే   కర్చు  తగ్గి   ఆదాయం  పెరగటమే  కాకుండా  వినియోగదారుల  ఆరోగ్యాన్ని  కూడా  కాపాడిన వారవుతారు      

Tuesday, 29 July 2014

జింక్ నేరుగా ఆకులపైన స్ప్రే చెయ్యడం వల్ల ....

సూక్ష్మ  పోషక   పాధార్తం   అయన  జింక్  నేరుగా ఆకులపైన స్ప్రే చెయ్యడం వల్ల   పంట పెరుగుదల లో మార్పు , స్ప్రే చేసినది , చేయ్యనది , రెండూ వేరు వేరు  ఫోటోలు పైన మీరు గమనించ గలరు , పోషక  పదార్థాలు   నేరు  గా  ఆకుల పైన స్ప్రే  చెయ్యడం వల్ల  ఎంతో  మేలు (ఫోటో :PUSA సౌజన్యంతో )

ఆశా నిరాశల మధ్య రైతులు ...



ఆశా నిరాశల  మధ్య  రైతులు  ...



ఇటివల  నేను పశ్చిమ గోదావరి, కృష్ణ,  గుంటూరు  ప్రకాశం , నెల్లూరు , చిత్తూరు  కడప  కర్నూలు  జిల్లాలలో  అనేక మంది  రైతులను  కలిసి  వారితో  వారి అనుభవాలను పంచుకున్నప్పుడు  ఆశా వాదులైన  రైతులు  వ్యవసాయం లో  వారు చేపట్టిన  అనేక నూతన విధానాలు  లాభసాటి వ్యవసాయం  గూర్చి  తెలియజేస్తూ  వరి సాగు లో   నాటు వేసే పద్దతిని వదిలి  నేరుగా వెదజల్లటం    మొదలైన పద్దతులు పాటిస్తూ కర్చు తగ్గించుకున్న  విధానాన్ని  తెలియజేసారు  , అయెతే  వర్షాలు  లేకపోవటం  కాలవుల ద్వారా నీరు  లేటు గా అందటం  మొదలైన విషయాలపై  చర్చించి  వరిలో  తక్కువ  కాల పరిమితి గల రకాలను  సాగు జేసినందున  నికరాదాయాన్ని పెంచే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో  చర్చించటం  జరిగింది.


 కొన్ని ప్రాంతాలలో  భూములు చదునుగా  లేకపోవడం  నీరు సరిగా  నిలవకపోవటం  కులుపు సమస్య,  అధిక ఎరువుల వినియోగం, చివరి వరకు కాంప్లెక్స్ ఎరువుల  వినియోగం  మొదలైన  విషయాలు  తెలియజేస్తూ  ఎకరానికి  ఇరవై నుండి  ఇరవై రెండు వేలు కర్చు పెట్టి  సగటున  25 బస్తాలు  BPT  పండించినట్లు చెప్తూ  కొన్ని చోట్ల  గ్రామస్తులు  తెలియజేయ్యగా  నాకు చాలా ఆశ్చర్యం కలిగింది  , లేసర్ లేవేలేర్ తో  వరి పొలాలను  ఒక సెంటీమీటర్ కూడా వ్యత్యాసం లేకుండా లెవెల్  చేసుకునే అవకాశం   గురించి  వారికి చెప్తే  ఇంతవరకు   దానిగురించి  తెలియదు అని వారు చెప్పారు  , అక్కడ కూడా వ్యవసాయాన్ని  లాభసాటిగా  ఎలా మార్చుకోవాలో అనే విషయాన్నీ గురించి చర్చించటం జరిగింది  ,



 అలాగే  నెల్లూరు జిల్లా కనిగిరి లో యెర్ర భూములలో జిగురు గోరుచిక్కుడు సాగును గురించి వివరించి మార్కెట్  సమస్య లేదని చెప్పినప్పుడు  , బ్యాంకు ద్వారా లోన్ పొంది  స్వంత ట్రాక్టర్  కలిగిన రైతులు  కనీసం మా ట్రాక్టర్ కిరాయిలు  మిగిలినా చాలు , అతి తక్కువ కౌలు తో భూములు తీసుకుని  దాదాపు  రెండు మూడు వేల ఎకరాలలో  జిగురు గోరుచిక్కుడు  సాగు చెయ్యడానికి ముందుకు వచ్చారు  



చిత్తూరు జిల్లా  పీలేరు గ్రామం లో  వ్యవసాయ శాస్త్రవేత్తలు  “ఆత్మ” అధికారులు  ఆదర్శ రైతులతో సమావేశం జరిగినప్పుడు  అనేక  కొత్త విషయాలు  చర్చకు రావడం జరిగింది   , అన్నపూర్ణ అనే పేరుతొ  ఒక అర ఎకరం లోనే  రకరకాల కూరగాయ  పంటలను  డ్రిప్ ద్వారా  పండిస్తున్న  రైతు  ప్రయోగం  చాలా  హర్షేనియం

ఎరువుల వినియోగాన్ని తగ్గించి  జీవామృతం  ద్వారా రకరకాల పండ్ల చెట్టులను  పండిస్తున్న రైతు  , వారి పంట ను  అధిక ధరలకు వినియోగదారులే  తోటవద్దకు వచ్చి  కొనుక్కుని వెళ్తున్నారు .



ఆ ప్రాంతం లో వరిసాగు తక్కువైనా సేంద్రియ పద్దతులలో  వరిని పండించి  BPT , బస్తా  వడ్లు  2500  రూపాయలకు  అమ్ముతున్న  రైతులను కూడా  కలవటం జరిగింది  , డ్రిప్ పద్దతిలో  వరి పండించే  ఆలోచన  ఉన్నట్లు  రైతులు తెలియజేసినప్పుడు  చాలా  ఆనందం కలిగింది  



అయిదు  ఎకరాలలో పూల సాగు చేపట్టి  ద్రిప్పు , ముల్చింగ్  విధానం లో బంతి , చామంతి , గులాబి  పక్కపక్కనే సాగు చేస్తూ  అతి తక్కువ రోజుల్లో వచ్చేది  , తక్కువ రోజుల్లో వచ్చేది , దీర్ఘ కాలం ఉండేది , ఈ మూడు  రకాలను  ఒక దాని పక్కన ఒకటి సాగు చేస్తూ  నూతన  విధానాలను  ఆవిష్కరిస్తున్న  ఈ రైతు శాస్త్రవేత్తల కృషి అభినందనీయం. 


చిత్తూరు జిల్లలో వ్యవసాయ శాస్త్రవేత్తలు  extension అధికారులు  చాలా చొరవుగా  నిరంతరం రైతులను కలుస్తూ  వారి సమస్యలను అడిగి తెలుసుకోవడమే  కాకుండా  కొత్త విధానాలు చేపట్టిన  రైతుల వివరాలు తెలుసుకుని  మిగిలిన  రైతులకు  ఆ విషయాలను  తెలియజేయ్యటం లో చొరవ చూపిస్తున్న  రైతు శ్రీ అబ్బయ్య నాయుడు , “ఆత్మ “ ఆఫీసుర్లు శ్రీమతి  జ్యోత్స్న   శ్రీ శ్రీధర, AO శన్ముఖం  గారు , ADA  శ్రీ రమణరావు  గారు కృషి అభినందనీయం      

నా ఆంధ్రా పరియటన లో ....

కడపకు దగ్గరలో అధునాతన పద్దతిలో బంతి చామంతి  గులాబి పువ్వులు  ఒకే చోట ఒకే సారి  సాగు  చేస్తూ అత్యదిక ఆదాయం పొందుతున్న  రైతు విగ్య్నాని  శ్రీ వెంకట సుబ్బారెడ్డి  గారి తో నేను  

కడపకు దగ్గరలో అధునాతన పద్దతిలో బంతి చామంతి  గులాబి పువ్వులు  ఒకే చోట ఒకే సారి  సాగు  చేస్తూ అత్యదిక ఆదాయం పొందుతున్న  రైతు విగ్య్నాని  శ్రీ వెంకట సుబ్బారెడ్డి  గారి తో నేను  

కర్నూలు జిల్లా   చాగలమర్రి   మండలం  పెద్ద వంగలి  గ్రామం లో పసుపు  జొన్న  మొక్కజొన్న  అరటి  మిర్చి  ప్రత్తి   వరి  మొదలైన  పంటలను  పండిస్తూ  వ్యవసాయాన్ని  లాభసాటిగా  మార్చిన  రైతులతో  యువ రైతు  శ్రీ ఓబుల రెడ్డి గారి ఆధ్వర్యం లో  జరిగిన  రైతుల తో చర్చా గోష్టి

శ్రీ వెంకట సుబ్బా రెడ్డి గారి  (విశ్వాసానికి మారు పేరైన)  ఆత్మీయ నేస్తం తో నా కరచాలనం

Monday, 28 July 2014

నా ఆంధ్రా పరియటన లో ....july 3rd week 2014

తామర కొలను గ్రామం (కృష్ణా జిల్లా ) గ్రామ పంచాయితీ అధ్యక్షలు మిత్రులు దాస్ గారు , ఆళ్వార్ స్వామి గారి తో

జి  కొండూరు గ్రామంలో (విజయవాడ దగ్గర ) ఆదర్శ రైతులతో , ఎకరానికి 22 వేలు కర్చు పెట్టి 25 బస్తాలు సాంభ మసూరి పండిస్తూ వ్యవసాయాన్ని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్న రైతులతో (శ్రీ  జి  వెంకటేశ్వర రెడ్డి,  KVK )

అవనిగడ్డ  వద్ద  జులై  ఆకర్లో   పరవళ్ళు  తొక్కుతూ  కనిపించే  కృష్ణవేణి  వేలవేల బోతున్న   దృశ్యం

చిగురుకోట గ్రామం (కృష్ణా జిల్లా ) అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ కుమార్ గారు ,రైతు నాయకులు  శ్రీ CSR దాస్ గారు , ప్రముఖ వ్యవసాయరంగ  వ్యాసకర్త , రచయత శ్రీ దాసరి ఆళ్వార్ స్వామి గారు , AO రమేష్ నాయుడు గారు , మరియు అనేక మందిప్రముఖ రైతులతో
నెల్లూరు జిల్లా కనిగిరి వద్ద ఒక గ్రామం లో వర్షాలు లేక ఎం చెయ్యాలో దిక్కుతోచక నిరంతరం నష్టాల బాట లో ఉన్న వ్యవసాయాన్ని జిగురు గోరుచిక్కుడు సాగు ద్వారా , కొంచెం ఊరట పొందిన రైతులు  ఈ  సంవత్సరం  షుమారు  రెండు వేల ఎకరాలలో జిగురు గోరుచిక్కుడు సాగు చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చి సమావేశం  అయ్యిన సందర్భం
నూతన  వరి సాగు విధానంలో  లోతుగా నాటిన వరిడుబ్బు 25 tillers  చెయ్యగా పైపైన నాటిన వరిడుబ్బు యాభై tillerlu చేసిన  వైనాన్ని  పరిశీలిస్తు పై పైన  నాటితే వచ్చే ప్రయోజనాన్ని  వివరిస్తున్న KVK

+
పీలేరు గ్రామంలో (చిత్తూరు జిల్లా )
" అన్నపూర్ణ " అనే పేరు పెట్టి రైతు విగ్య్నాని శ్రీ చంద్రశేకర్ , B కాం , అనేక ప్రయత్నాలు చేస్తూ నష్టాల ఊబిలో నుండి  లాభాల  వైపు  పయనిస్తూ  తోటి రైతులకు  ఆదర్శంగా  నిలిచి   వరి సాగు  లో నూతన విధానాలు ,  ఒకే ప్లాట్ లో  రకరకాల కూరగాయలు  డ్రిప్ (బిందు సేద్యం ) పండిస్తూ ఒక ఎకరంలో  అనేక రకాల  పండ్ల మొక్కలను  ఆపిల్ తో సహా , ప్రయోగాత్మకంగా  పండిస్తూ  జిల్లాకే ఆదర్శ  రైతుగా నిలిచిన ఈ రైతు ఆహ్వానం మేరకు పీలేరు వ్యవసాయ శాఖ అధికార్లు Dr  వేణుగోపాల్ రావు గారు , శ్రీ శన్ముఖం  గారు , శ్రీ శ్రీధర్ రెడ్డి గారు , శ్రమతి  జ్యోత్స్న , మరియు  ప్రముఖ ఆదర్శ రైతు శ్రీ  అబ్బయ్య నాయుడు , మరియు ఇతర యువ రైతులతో , షుమారు నాలుగు గంటల పాటు జరిగిన  చర్చా గోష్టి   

ఒకే ప్లాట్ లో  రకరకాల కూరగాయలు  డ్రిప్ (బిందు సేద్యం ) పండిస్తూ ఒక ఎకరంలో  అనేక రకాల  పండ్ల మొక్కలను  ఆపిల్ తో సహా , ప్రయోగాత్మకంగా  పండిస్తూ  జిల్లాకే ఆదర్శ  రైతుగా నిలిచిన ఈ రైతు ఆహ్వానం మేరకు పీలేరు వ్యవసాయ శాఖ అధికార్లు Dr  వేణుగోపాల్ రావు గారు , శ్రీ శన్ముఖం  గారు , శ్రీ శ్రీధర్ రెడ్డి గారు , శ్రమతి  జ్యోత్స్న , మరియు  ప్రముఖ ఆదర్శ రైతు శ్రీ  అబ్బయ్య నాయుడు , మరియు ఇతర యువ రైతులతో , షుమారు నాలుగు గంటల పాటు జరిగిన  చర్చా గోష్టి   

Saturday, 19 July 2014

20.7.2014

దేశ వ్యాప్తంగా  విస్తారంగా  వర్షాలు పడుతున్న కారణంగా  జిగురు గోరుచిక్కుడు  ధరలు స్థిరంగా  ఉండే అవకాశం ఉంది

Wednesday, 16 July 2014

దాగుడు మూతలు ఆడుతున్న వరుణుడు , దిక్కు తోచని స్తితి లో రైతన్న



దాగుడు మూతలు  ఆడుతున్న  వరుణుడు , దిక్కు తోచని స్తితి లో రైతన్న  :
ఒక్క ఈశాన్య   భారతం లో తప్ప  మిగిలిన దేశం అంతా  ఎక్కడా కూడా సరైన వర్షపాతం  నమోదు కాలేదు , ప్రస్తుత పరిస్తితి లో  రైతులు  తీర ప్రాంతాలు  తగ్గు ప్రదేశాలలో  వరి తప్ప మరేమీ పండని స్తితి లో  తక్కువ  కాల పరిమితి గల  వరి వంగడాలను విత్తటం   లేదా  వెదజల్లటం  అనే పద్దతి  ద్వారా సాగు  మంచిది,  అయితే  సరి అయిన  తేమ దొరకని పరిస్తితులలో  భూమి లో వేసిన ఎరువు  వృధా  అయ్యే పరిస్తితి  ఉన్నప్పుడు  ఎరువులను  ఆకులపై స్ప్రే  చెయ్యడం  సరి అయిన పద్దతి
ప్రస్తుత పరిస్తితి లో  మెరక భూములలో  ఆయా  ప్రాంతాలకు తగినట్టు  తృణ  ధాన్యాలు  కూడా పండించ వచ్చు , ఈ సంవత్సరం  ఎటువంటి పంట పండించినా  అమ్ముడు పోదు  , ధర రాదు  అనే సందేహం  అవసర౦లేదు , అయెతే సాధ్యమైనంత  కర్చును తగ్గించి  పండించే మార్గాలను  అనుసరించాలి , ఎగుమతికి అనుకూలమైన  జుగురు గోరుచిక్కుడు సాగు చేపట్టి నందున  మంచి రేట్  వచ్చే అవకాశం ఉంది , కారణం  ఈ పంట ముఖ్యంగా పండించే  మూడు రాష్ట్రాలు కూడా ఇంత  వరకు  విత్తనం వెయ్యలేక పోయింది , దక్షిణ భారతం  లాగా , సంవత్సరం పొడవునా    పంటను సాగు చేసి అవకాశం వారికి లేదు , కనుక తప్పక ప్రయత్నించ గలరు

Sunday, 13 July 2014

gallery

మద్యలో ఉన్న వారుమనందరికీ  పరిచయస్తులైన  మడమ  తిప్పని  మహా  యోధుడు 1991  నుండి  (పాల  పార్టీ) మిల్క్ ఫెడరేషన్   అధ్యక్షుడు మండవ జానకి రామయ్య గారిని  గూర్చి  ఎంత చెప్పినా  తక్కువే , రైతు కుటుంభం లో జన్మించి  ఇంటర్  వరకే  చదువుకున్నా  రైతుల కోసం  అనుక్షణం శ్రమిస్తూ  నేటి వరకు  పాడి పరిశ్రమ సామాఖ్య  అధ్యక్షులుగా  కొనసాగుతూ   కోట్లాది రూపాయలను  రైతులకు బోనస్ గా ఇచ్చి  పాడి పరిశ్రమను అచలoఅంచలుగా   అభివృద్ధి చేసి  ఇరవై కోట్ల  వార్షిక  వ్యాపారాన్ని 500  కోట్ల వరకు పెంచి కృషి,  పట్టుదల  , నిజయీతి  ఉంటె ఆసాధ్యమనేది లేదని నిరుపిస్తున్న  83 ఏళ్ళ  ఈ మహానీయుడు  నిండు నూరేళ్ళు జీవించి  రైతులకోసం ఇంకా ఎంతో  మేలు చెయ్యగలరని ఆశిస్తూ  వారికి  ఆయురారోగ్యాన్ని  ప్రసాదించవలసిందిగా  భగవంతుడిని కోరదాం ,   ఫోటో లో కుడిపక్కన ఉన్న పద్మశ్రీ  నరసింహ రాజు యాదవ్ గారు ఆదర్శ రైతుగా  సైనికుడి గా కళాకారుడిగా ఎన్నో ఉన్నత  శిఖరాలను  అధిరోహించి  పద్మశ్రీ అవార్డు  పొంది  రైతు లోకానికే ఆదర్శ మూర్తి 


అమరులైన  కొల్లూరి  కోటేశ్వరరావు గారు శ్రద్దాంజలి  సమావేశం లో వారిని  గురించి  నాలుగు  మాటలు మాట్లాడ  మన్నప్పుడు , నాకు వారిని  గురించి చెప్పడానికి మాటలను వెతకాల్సిన స్తితి లో పడ్డాను  కారణం , అతి నిరు పేద రైతు కుటుంభంలో  జన్మించి ఎన్నో కష్ట నష్టాలకోర్చి  ఉన్నత విద్యనభ్యసించి  ఉపాధ్యాయ వృత్తి  లో ఉంటూ తన తోటి   ఉపాధ్యాయులందరి  సమస్యలను చట్ట సభలో  ప్రస్తావిస్తూ  వారి సమస్యల పరిష్కారానికి  షుమారు 17  సంవత్సరాల పాటు శాసన మండలి సభ్యుడిగా  శ్రమించారు
ఉపాధ్యాయుడిగా  తరగతి గదిలో  బోదించడం  కాకుండా  తెలుగు విద్యార్ధి  పత్రికను స్థాపించి  యావద్  విద్యార్తి లోకాన్నే కాకుండా  తెలుగు భాషాభిమానులందరికి  కర దీపికగా  వెలుగుతున్న  పత్రికను  నిరంతరాయంగా  యాభై సంవత్సరాల పైగా నడుపుతూ  తెలుగు విద్యార్ధి  లోకానికి ఎంతో నిస్వార్ధ సేవ చేసిన  మహోన్నత వ్యక్తీ  ని  నా చిన్నతనం నుండి  అతి దగ్గరగా చూసి  ఆయనను  ఆదర్శంగా తీసుకుని    వారిలాగానే  పేదరికం పై  అజ్జ్ఞానం  పై  పోరాటం నేర్చుకుని  పుట్టిన గ్రామాన్ని  వదిలి  ఎంతో దూరం వచ్చినా  నాకు  వారు భౌతికంగా లేకపోయినా  వారి జీవిత చరిత్ర , సమస్యలతో పోరాట పటిమ నాకెప్పటికీ  చిర స్మరనణియమే