ప్రియమైన రైతు సోదరులకు
కని విని ఎరుగని అనావ్రిష్టి అతివ్రిష్టి నేపధ్యం లో 24 .9 .2015 తారికున ఢిల్లీ లోని IARI భారతీయ వ్యవసాయ పరిశోదనా సంస్థ వారి ఆధ్వర్యం లో జరిగిన సమావేశంలో ప్రస్తుత వాతావరణ పరిస్తితులు , ప్రపంచదేశాల ఆర్ధిక పరిస్తితుల పై చర్చిస్తూ రాబోయే సంవత్సరంలో రైతులు ఎదుర్కోవలసిన అనేక సవాళ్ళను గురించి చర్చిస్తూ గతంలో ఎన్నడు లేని విధంగా జలాశాయాలలో నీరు నిలువ తగ్గిపోవడం , భూగర్భ జలాల మట్టం కూడా అడుగంటిన నేపధ్యంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవసాయం తద్వారా ఉత్పన్నమయ్యే ఆర్ధిక పరిణామాలను ఎదుర్కొనే విధంగా రైతులను చైతన్యపర్చవల్సిందిగా నాటి సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ఆదర్శ రైతులకు చెప్పడం జరిగింది , ప్రస్తుత గడ్డు పరిస్తితులలో వరి సాగును తగ్గించి దేశం ఎదుర్కొంటున్న దిగుమతుల సమస్యను అధిగమించడానికి పప్పు గింజలు , నునే గింజలు ప్రోత్సహించాలిసిందిగా తెలియజేస్తూ
అతితక్కువ సమయంలో అతి ఎక్కువ దిగుబడిని ఇవ్వగలిగిన కంది , పెసర మరియు మినుము క్షేత్రాలను కూడా చూపించడం జరిగింది , రైతు సోదరులు వ్యవసాయాన్ని పరిశ్రమల లాగా వాణిజ్య సరళి లో అనగా తక్కువ నీరు , తక్కువ కర్చు ఎక్కువ ఆదాయాన్ని గడించే విధంగా సాగు పద్దతులను ఆధునిక పద్దతులను ఉపయోగించి పండించవల్సిందిగా తెలియజేసారు , దూరదర్శన్ ద్వారా ప్రసారమయ్యే కృషి దర్శన్ కార్యక్రమాలను కూడా రోజు చూస్తూ సాటి రైతులను చైతన్యపరచవలసిందిగా తెలియచేసారు .
No comments:
Post a Comment