Saturday, 30 August 2014

హరిత విప్లవం వల్ల మనం కోల్పోయిన పక్షి సంపద ..... మళ్ళి ఇవి తిరిగి వస్తే మానవ లోకానికి మంచి రోజులు వచ్చినట్లే



హరిత విప్లవం తరవాత ..మన వాడుతున్న పురుగు మందుల వల్ల  ఇలాంటి ఎన్నో జీవ రాశులు దాదాపు అంతరించి పోయాయి ....మనిషి ఆరోగ్యం పైన కూడా  తీవ్రదుష్పరిణామాలు  పడుతున్నాయి .. ఉత్పాదకత  తగ్గకుండా   మెల్ల మెల్లగా  సావయవవ్యసాయ పద్దతులను అనుసరించాల్సిన  సమయం వచ్చేసింది ....
రైతు మిత్ర  గా పిలిచే  ఎర్రలు  ఎప్పుడు  ఎక్కడ కనిపించడం లేదు ..
వాటిని ప్రత్యేకంగా పెంచాల్సి వస్తుంది ..
పశు సంపద , పక్షి సంపద మళ్ళి వృద్ది చెందితే నే మనకి కూడా ఆరోగ్యవంతమైన ఆహరం దొరుకుతుంది..అలా జరగాలి అంటే రైతులలో చైతన్యం రావాలి ..భూమిలోసారం ఎంత ఉందొ ..మనం వేసేపంటకు ఎంత కావాలో తెలుసుకుని   ఎరువులు మితంగా  వాడితే  , అధిక క్రిమినాశకాలు  వాడాల్సిన పరిస్తితి  రాదు .... అప్పుడే రైతు ఆర్ధికంగా నిలదోక్కుకునేది  ...  రైతు బాగుంటేనే దేశం  ,దేశ ప్రజలు బాగుండేది.

Thursday, 28 August 2014

ఆదర్శ రైతు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు Bsc



ఆదర్శ రైతు  శ్రీ  వెంకటేశ్వర  రెడ్డి  గారు  Bsc

g  కొండూరు  కృష్ణా జిల్లా  ఆంధ్ర ప్రదేశ్ , విరు  ఎరువుల, పురుగు మందులు  కొట్టు  ఉన్నప్పటికీ  రైతు సోదరులకు  మితంగా ఎరువులు వాడమని  ఉత్పత్తి  కర్చు తగ్గించాలని  రైతు  ఆర్ధికంగా  లాభపడాలి అని చెప్తూ  తనుకున్న  పరిగ్య్ఞానాన్ని  వ్యాపార దృక్పదం  తో కాకుండా  రైతులను  ప్రోత్సహిస్తూ  తాను తెలుసుకున్న నూతన విధానాలను రైతులతో ఆచరింప చేస్తూఉన్న   ఆదర్శ రైతు , వారి ఫోన్ నెంబర్ :  08341130111


రైతు మిత్రులకు మిత్రుడు :శ్రీ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు



రైతు మిత్రులకు మిత్రుడు :

శ్రీ దమ్మాలపాటి  శ్రీనివాస్ గారు , ఇంకొల్లు  మండలం , సూది వారి పాలెం . ప్రకాశం జిల్లా .

వీరు   విత్తనోత్పత్తి , వరి  మరియు  మెట్ట పైరుల సాగు మరియు    సస్య రక్షణ  పై  అనుభవాన్ని  గడించటమే కాకుండా  నిరంతరం  శాస్త్రవేత్తలతో  స్థానిక  వ్యవసాయ సమస్యల  పై చర్చిస్తూ , తనకున్న అనుభవాన్ని జోడించి , వారిని అడిగిన రైతు మిత్రులకు  సలహాలు ఇస్తూ  నూతన వంగడాలను  నోటాన విధానాలను  ప్రాయోగికంగా  పండిస్తూ   అందులో  సాధక భాదకాలు  ఇతర రైతులతో  నిరంతరం  సంప్రదిస్తూ ఆ ప్రాంతం లో ఎంతో మంది చిర పరిచితులైన  శ్రీ D . శ్రీనివాస్ రావు గారితో  పంటల విషయం  వారితో మీ అనుభవాలను పంచుకోవచ్చు   

వారి సెల్ no : 09603105171

గోమాత పార్వతి మరియు కళ్యాణి

గోమాత పార్వతి  మరియు కళ్యాణి

Sunday, 24 August 2014

నేరు గా విత్తిన వరి పైరు

వరుణుడి కటాక్షంతో వాగులు వంకలు ఏరులై పారుతున్న వేళ  22.8.2014 

నేరుగా విత్తిన వరి 22.8.2014 

ఎకరాకు  అయిదు kg లు  BPT విత్తనాల్ని  నేరు గా విత్తిన పైరు, 22.8.14

నేరుగా విత్తిన వరి పైరు తక్కువ వ్యవధి లో బాగా పెరిగిన దుబ్బు,22.8.14


తక్కువ లోతులో విత్తిన  గింజ , బాగా దుబ్బు చేసి , ఎక్కువ పిలకలు రావటం పై చిత్రం లో చూడవచ్చు 22.8.14

Friday, 22 August 2014

farmer scientists Dr Koteshwar rao garu, రైతు విజ్న్యాని శ్రీ కోటేశ్వరరావు గారు



వ్యవసాయంలో నిరంతర హరిత విప్లవం గురించి చాలా  మంది మాట్లాడుతూ ఉంటారు.శాస్త్రవేత్తల పై విమర్శలు ల్యాబ్ టు ల్యాండ్ సరిగా లేదని విమర్శిస్తూ వుంటారు.అయితే ఇది అర్ధ సత్యం మాత్రమే అనేది  నా అభిప్రాయం! కారణం గత పదిహేను సంవత్సరాల నుండి నేను ఈ దిశగాఎంతో శ్రమిస్తూసాటి రైతుల నుండి ఎన్నో విమర్శలు,అవమానాలు ఎదుర్కోంటున్నాను.ఒక కొత్త విషయాన్ని అమోదించడంలో కొంత మంది అవమానంగా భావించటం,ఈ విధమైన ప్రవర్తనకు కొంత న్యూనత భావం కావచ్చు.ఏది ఏమైనప్పటికీ ఒక తాగుబోతు,ఒకతిరుగుబోతు,ఒక జూదగాడునైన సమాజం గౌరవిస్తుంది. కానీ నూతన విదానంలో వ్యవసాయం కానీ, అనుభంద ఉత్పత్తులను ప్రారంభించే వార్నీ నిరాశ పరచటం ,అవమానించటం మనం చూస్తున్నవే అంతే కాకుండా ఇంతటి వ్యతిరేక్త పరిస్టితిలో కూడా సాటి రైతుల విమర్శలను లెక్కచేయకుండా, ముందుకుపోతున్న కొంత మంది రైతు శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. 


వారిలో ఒకరు డాక్టార్ ఎం.కోటేశ్వర్ రావు గారు  కోడూరు మండలం ,కృష్ణాజిల్లా , నరసింహాపురం వాస్తవ్యులు . 60 సంవత్సరాల పై పడ్డ డాక్టరు గారు కొంత కాలం తెలంగాణా లోను , కొంత కాలం ఆఫ్రికా దేశాల్లోను  డాక్టరుగా వారి వృత్తి కొన్నసాగించినప్పటికి వారి తండ్రిగారి కోరికపై స్వగ్రామం వచ్చినప్పటి నుండి వైద్య వృత్తిని కొనసాగిస్తూ అలాగే వ్యవసాయం కొనసాగిస్తూ అక్కడి ప్రజలకు సేవచేస్తూన్నారు. మూడు సంవ్సరాల క్రిందట 60 ఎకరాల్లో బాస్మతి సాగుచేసి వారే కాకుండా ప్రక్క రైతులను ప్రోత్సహించి , బాస్మతి ప్రప్రదమంగా సముద్రతీర ప్రాతంలో సాగుచేసిన ఘనత వారికే దక్కుతుంది.బాస్మతి 1121 రకాన్ని సాగుచేయమని ప్రోత్సహించిన వారు సరి అయిన సలహాలు,సూచనలు ఇవ్వకపోవడంతో కొంత ఆందోళనకు గురైనాడు. ఆ సందర్భంలోనే నాకు పరిచయమై నేను రెండు,మూడు సార్లు వారి గ్రామానికి వెళ్ళడం వారితో అనేక విషయాలు వ్యవసాయం పై చర్చించటంజరిగింది. గత 20,25 సంవత్సరాల నుండి ఆ చుట్టూ ప్రక్కల రైతులు బిపిటి 5204 అనే రకాన్నే సాగుచేస్తూ అనేక రకాలైన రోగాలు,తెగుళ్ళ ను ను ఎదుర్కొంటూ లాభసాటి కాని బిపిటి రకం సాగులో నిరాశ చెంది ఉన్న  రైతులకు డాక్టరుగారు తెసుకున్న బాస్మతి సాగు కొదరిలో ఆశ కలిగించిన ఆ పంట దిగుబడి సరిగా రాకపోవడం ,సరైన మార్కెట్ సదుపాయం లేకపోవడం ,అనేక సమస్యలతో నీరశాపడిన , నా ప్రోత్సహంతో డాక్టరు గారు గత సంవత్సరం కూడా బాస్మతిలో పలు రకాల,షర్బతి అనే రకాన్ని,జైశ్రీరాం అనే రకాన్ని బాగా పండించ కలిగాము.ఆధునిక పరికరాలైన లేజర్ లేవలర్ తో వారి వ్యవసాయ భూమిని పొలం మొత్తం ఒకే లెవల్ గా చేయటం మరియు నేరుగా విత్తనాన్ని విత్తే విధానాన్ని ప్రవేశపెట్టటం జరిగింది.లేబర్ దొరకక, నాటు వేయటానికి ఎంతో సమస్యగా మారిన ప్రస్తుత తరుణంలో డాక్టరు గారు తీసుకున్న నిర్ణయంతో ఈ రోజు గ్రామం మొత్తం విత్తనాన్ని నేరుగా విత్తడమే కాకుండా ఎకరానికి ౩౦ కేజీలు వాడే విత్తనం 10 నుంచి 15 కేజీలకే తీసుకరాడం ఏ నెలలో నాటు వేసిన 150 రోజుల పంటైన బిపిటి రకానికే స్వస్తి పలికి, నీటి లభ్యతను బట్టి 130 రోజుల అవధి కలిగిన జైశ్రీరాం , 120 రోజులు, అరెఎన్ఆర్15048, 110 రోజుల వ్యవధి కల్గిన పంజాబ్ బాస్మతి 1509 అనే రకాలను ఎంచుకొని విత్టటం అనేక మంది రైతులు సాగుచేయటం ద్వారా ఆ చుట్టుప్రక్కల  గ్రామలలోని అనగా నాగాయలంక ,ఎదురుమండి, ఎటిమేగా, రేపల్లె , ఇలా ఎన్నో గ్రామాల రైతులకు డాక్టరు కోటేశ్వరావు గారు నూతన విధానాలను పరిచయంచేస్తూ ఒక భస్తా ధాన్యం ఉత్పత్తి ఖర్చు 300ల నుంచి 350 రూపాయలకు తీసుకరాగలరని ఆసిస్తూ, విమర్సలకు వెరువక నూతన విధానాలను ప్రవేశపెడుతూ సాటి రైతు సోదరులకు మార్గదర్శనం చేయగలరని ఆసిస్తూ వార్నీ అభినందిస్తున్నాం.

Thursday, 14 August 2014

MY JODHPUR TRIP IN AUGUST 2014

Dr  Omveersingh ji   senior Most scientist and Director at NATIONAL BEUREAU OF PLANT GENETIC RESOURCES at Jodhpur  SHOWING THE RESULTS OF THE LATEST RESEARCH DEVELOPMENTS IN DIFFERENT VARIETIES  OF PULSES, GUAR AND WHEAT , THEY MAINTAINED 36000 VARIETIES OF SEEDS IN THEIR BEUREAU

NEW VARITIES OF GUAR UNDER RESEARCH

NEW IMPROVED VARIETY OF GUAR , ALREADY IT HAS YIELDED 34.5 QUINTALS PER HECTARE , NOT YET RELEASED FOR COMMERCIAL PRODUCTION , THIS VARIETY WILL BRING A REVOLUTION IN GUAR CULTIVATION , THIS VARIETY IS DEVELOPED BY DR OMVEER SINGH senior Most scientist and Director at NATIONAL BEUREAU OF PLANT GENETIC RESOURCES at Jodhpur 
YELLOW MOSAIC RESISTANT VARIETY  IDENTIFIED IN BLACK GRAM , MIDDLE ONE IN THE PHOTO AT JODHPUR IDENTIFIED BY DR OMVEER SINGH JI 

DR OMVEERSINGH JI EXPLAINING TO ME THE MULTIPLICATION OF 15 YEAR OLD SAFELY STORED SEED 

Wednesday, 13 August 2014

ఆత్మీయులైన రైతు సోదరులకు



ఆత్మీయులైన  రైతు సోదరులకు , వర్షాభావ  పరిస్తితుల  వలన  సకాలం లో  పంటలు వెయ్యడానికి  విలు కాని ప్రదేశాలలో ఈ ఆగష్టు  నేలాకర వరకు జిగురు గోరుచిక్కుడు  సాగు చెయ్యడానికి అవకాశం  ఉంది , ఉత్తర భారత దేశం లోని జిగురు గోరుచిక్కుడు  పండే ప్రాంతాలైన  రాజస్తాన్ , హరియాణ  ప్రాంతాలలో వర్షం పడినప్పటికీ  గుజరాత్ రాష్ట్రం లో వర్షాలు  కురవని సందర్బంలో  వచ్చే సంవత్సరం  గోరుచిక్కుడు ఉత్పత్తి  దేశంలో  తగ్గే అవకాశం కనబడుతుంది , అందువల్ల  ధర కూడా పెరిగే అవకాశం  ఉన్నందున  ఆంద్ర  ,తెలంగాణా , కర్ణాటక  రాష్ట్రాలలో  సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతం లో ఈ పంటను సాగు చేసినందు వల్ల  మంచి ఆదాయం  పొందడానికి అవకాశం ఉంది , మొదటి పంటగా ఈ ఆగష్టు చివరి వరకు సాగు చెయ్యవచ్చు , రెండోవ పంటగా  వరి పంట కోసిన తరవాత ఫెబ్రవరి  లో కూడా సాగు చెయ్యవచ్చు 


అతి తక్కువ నీటితో , అతి తక్కువ కర్చుతో  నికరాదాయాన్ని ఇచ్చే ఈ పంట  ప్రస్తుత పరిస్తితులలో  ఎక్కువ మంది రైతులు దిన్ని సాగు చేసినందువల్ల  మంచి ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంది, ఈ పంటతోపాటు , ముతక దాన్యలైన కొర్ర , రాగి , లేదా మీ మీ ప్రాంతాలలో పండే ముతక ధాన్యాలను కూడా మిశ్రమ పద్దతులలో  సాగు చేసే విధంగా  ఈ bolg చూసే  మిత్రులు  మీ చుట్టుపక్కల రైతు సోదరులను చైతన్యపరిచి  ప్రోత్సహిస్తే  ప్రస్తుత వర్షాభావ  పరిస్తుతలనుండి  కొంతవరకైనా  రైతు ఆర్ధికంగా నిలబడగలడు

ఈ బ్లాగ్  చూస్తున్న  మిత్రులందరికీ సవినయంగా నేను చేసే విన్నపం ఏమనగా  ఎంతో మంది రైతులు అప్పుల బాధ తట్టుకోలేక బలహీన క్షణం  లోఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు , మీరు వారికి  సాధ్యమైనంత ధైర్యాన్ని ఇచ్చి నచ్చజేప్పగలిగితే  అన్నదాతల  ఆత్మహత్యలను  నివారించగలం , తప్పక మీకు చేతనైనంత వారికి మనోస్థైర్యాన్ని  ఇవ్వగలరు