Monday, 10 March 2014

కృషి మేళా

కృషి మేళా :
ఫెబ్రవరి  26 ,27 28 న డెల్లి లో కృషి మేళా జరిగింది , ఎంతో మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు , వ్యవసాయం లో వస్తున్న నూతన మార్పులు ..నూతన వంగడాలు రైతు కు లాభసాటిగా ఉండాలి అంటే ఎం చెయ్యాలి  అనే విషయాల మీదే ప్రధానంగా చర్చిస్తూ భారత దేశం లో ఇరవై ఎనిమిది కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార దాన్యాలని ఉత్పత్తి చేసి  చైనా తరువాత  ప్రపంచం లోనే రెండో దేశంగా ఉన్నాం , అయితే ప్రజలకు కావాల్సిన పోషకాహార కొరతను తీర్చాలి అంటే ఆహార దాన్యాలే కాకుండా ఇతర పంటలు (హార్టికల్చర్ ) పై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి అని చెప్తూ  రక్షిత వ్యవసాయం (protective agriculture ) ఉపయోగం లోకి తేవాల్సిన అవసరం ఉత్తర భారత దేశానికి ఎక్కువగా ఉందని చెప్తూ సమ సీతోష్ణ  స్తితి కలిగిన దక్షిణ భారత ప్రాంతం లో పండే పంటలను ఇక్కడ కూడా పండించవచ్చు అని చెప్పారు , ప్రయోగాత్మకంగా  కర్చు తక్కువతో పోలి హౌసెస్ ఉపయోగించి  చలి కాలం లో కూడా  అనేక రకాల కూరగాయులు పూలు అన్ని కూడా పండించ వచ్చు ... అలాగే ప్రతి ఇంట్లో కుండిలలో  పండించే విధానాన్ని గురించి కూడా చెప్పారు , మామిడి మొదలైన తోటలలో మొక్కల సాంద్రతను పెంచి ప్రునింగ్ చేస్తూ ప్రతి సంవత్సరం కాపునిస్తూ అధిక దిగుబడి  సాధిస్తూ  స్వదేశం లోను మరియు ఎగుమతులలోను మార్కెట్ చెయ్యడం వల్ల రైతు అధిక లాభాలు సాదించవచ్చు అని చెప్పారు . మార్కెట్ లోకి ఉత్పత్తి ఎక్కువ  వచ్చి  ధరలు పడి పాయినప్పుడు  ఆ పంటను నిలువ ఉండే విధంగా మార్చి  విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశాలను గురించి కూడా వివరించటం జరిగింది
వరి పంట విషయం పై మాట్లాడుతూ అధిక వర్షాలు పడే ఈశాన్య రాష్ట్రాలు తీర ప్రాంతాలు వరిను పండించాలి అని చెప్పారు , భూగర్బ జలాలు ఉపయోగించి అధిక విలువ కలిగిన ఎగుమతి కి అనుకూలమైన పంటలు పండించినందున ఇటు రైతుకి లాభం తోపాటు అటు దేశానికి కూడా విదేశీ మారక ద్రవ్యం  కూడా వస్తుంది అని చెప్పారు , ఆ క్రమం లో బస్మతిని ఎక్కువ పండించాల్సిందిగా రైతులకు సూచించారు .

No comments:

Post a Comment