Monday, 22 July 2013

మేలుకో రైతన్నా ..................

Broadcasting date : 4.9.2013,variety: WGL 32100, 39th day crop
,
14th day వరి విత్తనాన్ని నేరుగా చల్లి వీడెర్  తో  సాళ్ళు గా  చేసిన  రైతు విగ్న్యని శ్రీ దశరద రావు . 9440484990
వరి విత్తనాన్ని నేరుగా చల్లి వీడెర్  తో  సాళ్ళు గా  చేస్తున్న రైతు విగ్న్యని శ్రీ దశరద రావు . 9440484990
మాతృ  దేవోభవ       పితృ దేవోభవ       ఆచార్య దేవోభవ ....  అనేది  పెద్దల సూక్తి , అయెతే పుట్టిన దగ్గరనుండి చనిపోయే వరకు ఆహారాన్ని  అందిస్తున్న రైతును , రైతు దేవోభవ  అని ఎందుకు  అనకూడదు ???
కనుక   మాతృ  దేవోభవ       పితృ దేవోభవ     రైతు దేవోభవ       ఆచార్య దేవోభవ  అని  అన్నదాత  ఋణం తీర్చుకోవచ్చు కదా 


2012 లో  45 కంపనీలు  గోరుచిక్కుడు ధరలను కృత్రిమంగా పెంచి భారి గా లాభాలు పొంది రైతులు ను తీవ్రంగా నష్ట పరిచినందుకు గాను భారత ప్రభుత్వ దరియాప్తు  సంస్త  ఆ నలభై  అయెదు సంస్త ల పై వంద  కోట్ల జరిమానా విధించాలి అని నిర్ణయించింది ......  లక్షలాది మంది రైతులు  ఆ ధర వస్తుంది అని ఆశించి  అమ్ముకోలేక తీవ్రంగా నష్ట పోయారు ...
 source :http://www.thehindubusinessline.com/industry-and-economy/agri-biz/guargum-seed-price-surge-fmc-set-to-impose-rs-100cr-penalty-on-cartel/article5164488.ece

The Forward Markets Commission (FMC) is set to impose a penalty of Rs 100 crore on a cartel which has been found to be behind the surge in guarseed and guargum prices on futures exchanges to record high last year.

Guargum prices had soared to over Rs 1 lakh a quintal and guarseed to over Rs 30,000 in March last year, forcing the commission, which regulates commodities markets in the country, to suspend futures in both.

An official of the FMC said that the Government will be taking action based on a report submitted to the Consumer Affairs Ministry in October last year, on the unusual price movement.

The report had found fault with at least 45 traders.

Responding to question on the report, the official, who did not wish to be identified, said: “The Government is taking action on the report. Notices have been issued and soon, Rs 100 crore penalty will be imposed on the cartel found to be behind this.”





పప్పు గింజల సాగు : 25.7.2013
వరి నాట్లు ఆయెన తరువాత గట్ల పై పెసర మినుము కంది విత్తటం కొంత కాలం క్రిందట చాల మంది రైతు సోదరులు చేసేవారు , అయెతె ఇటీవల ఈ పద్దతిని పూర్తిగా మర్చిపోయి కేవెలం వరి సాగు మీదే ద్రిష్టి పెట్టి మిగిలిన ఉత్పత్తులను మార్కెట్ లో కొనుగోలు చెయ్యటకు అలవాటు పడి రైతులు ఆర్ధికంగా నష్టపోతున్నారు  ఎ మాత్రం అవకాశం ఉన్నా పప్పు గింజలు కూరగాయలు , పాడి , పెరటి కోళ్ళ పెంపకం మొదలైనవి  విధానాలను ఆచరించినంత కాలం రైతు ఆర్ధిక స్థితి బాగుండేది , పాత పద్దతులను మర్చి కేవలం ఒకే పంటను పండించి మిగిలిన అన్ని వ్యసాయ ఉత్పత్తులను మార్కెట్ లో కొనే దుస్స్తితి వల్ల ఈ నాడు రైతు ఆర్ధికంగా ఇబ్బందుల పాలవుతున్నాడు ఈ సమస్య కు పరష్కారం గా ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో చిన్న పప్పుల మిల్లులు స్తాపించి ఎంత చిన్న పరిణామంలో అనగా 20 కిలోలు మీరు పండించిన ఎ పప్పు  గింజలనైన ఇచ్చి మీకు కావాల్సిన పప్పు ను అనగా పెసర , మినుము కంది మొదలైన పప్పులను తెచ్చుకునే  ఏర్పాటు ఆదర్శ రైతులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది , కనుక విద్యావంతులైన యువ రైతులు పై విధంగా చిన్న పపు తయారి మిల్లును ప్రారంభించి ఏ రైతైనా తను పండించిన పప్పు గింజలను ఇచ్చి వారి కుటుంబ అవసరానికి కావాల్సిన పప్పులను పొందే విధంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఎంతో మేలు చేకూర్చిన వారు ఆవుతారు , అలాగే ఇద్దరు ముగ్గురు విద్యావంతులైన యువకులకు జీవనోపాది కలుగుతుంది , కేవలం వస్తు మార్పిడి అయేనందున  ఇది ఒక మంచి విధానంగా రైతులందరుకు అందుబాటులోకి వస్తే ప్రతి రైతు పప్పు గింజల పంట పై ఆసక్తి పెరిగి , పప్పు గింజలను పండిస్తూ కల్తి లేని మంచి పప్పులను పొందటమే కాకుండా ఈనాడు  ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి పప్పులను దిగుమతి చేసుకునే స్థితి నుండి బైట పడగలం కనుక యువ రైతు మిత్రులారా ఈ విషయం పై మీకు ఏమైనా సందేహాలు ఉంటె సాయంత్రం 7 గంటల నుండి 9 గంటలలోపు  ఈ దిగువ తెలిపిన ఫోన్ లో నన్ను సంప్రదించగలరు : 09448190919


వరి సాగు లో కర్చు తగ్గించే నూతన విధానాలు : 24.7.2013
నానాటికి ఎక్కువ ఔతున్న  కృషి కార్మికుల కొరత  పెరుగుతున్న ఎరువుల ధర , దిసల్  ధర , అలాగే తరుగుతున్న బియ్యం తలసరి వినియోగం , ప్రభుత్వాల జనాకర్షక ఆర్ధిక విధానాల వల్ల  పరోక్షంగా వరి రైతు  నష్టపోతున్నాడు .     పరిణామాల  నేపధ్యం  లో రైతు తన సంప్రదాయక సాగు విధానాలను వీడి , కర్చు తగ్గే నూతన విధానాల అన్వేషణ మరియొ వాటి ఆచరించకపోతే   నష్టాల ఊబి లో కూరుకు పోవాల్సి ఉంటుంది   చిన్న కమతాల  వ్యసాయం లాభసాటి కాదని ప్రభుత్వాలు కార్పొరేట్ పెద్దలకు భూములను కట్టబెట్టే పరిస్థితులు కనబడుతున్నాయ కనుక మిత్రులారా, వ్యసాయాన్ని  లాభసాటిగా మార్చుకునే దిశలో మనం ప్రయత్నం చెయ్యకపోతే మన భూముల్లో మనమే కూలీలుగా మారే పరిస్థితులు తప్పవు  వరి సాగు లో సాంప్రదాయక పద్దతులైన నారు పెంచి దమ్ము చేసి నాటు వేసే విధానాన్ని మార్చి నేరు గా విత్తే పద్ధతి వల్ల ఎకరాకు 4 నుండి 5 వేలవరకు కర్చు తగ్గించి , 5 నుంచి 10 బస్తాల దిగుబడి పెంచడమే కాకుండా ఎరువులు పురుగుమొందుల  వినియోగం కూడా బాగా తగ్గించే ఈ నూతన విధానాన్ని సందేహాలకు తావు ఇవ్వకుండా ప్రతి రైతు ఆచరించితే వరి పంటలో అత్యదిక   లాభాలను పొందవచ్చు అనే దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు , కావాల్సిందల్లా నూతన విధానాలను ధైర్యంగా చేపట్టమే .


గోరుచిక్కుడు రైతులకు విశేష సూచన: 23. 7. 2013
గోరుచిక్కుడు సాగు దేశవ్యాప్తంగా బాగా పెరుగుతున్నదున , కేవలం బీడు భూములు ఇతర పంటలకు అనుకూలం కాని భూములలో మాత్రమే తక్కువ కర్చుతో ఉత్పత్తి చేస్తే , ధర తగ్గినా నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అవకాసం ఉన్న అన్ని ప్రాంతాలలో ఈ పంట సాగు గణనీయంగా పెరుగుతోంది , కనుక రైతు సోదరులు ఈ పరిస్తితులను గమనించవలసింది గా కోరుతూ , సాధ్యమైనంత వరకు గోరుచిక్కుడు మిశ్రమ పంటగా , అనగా కంది, సజ్జ , కొర్ర , పొద్దుతిరుగుడు మొదలైన పంటలతో పండించ గలరు.  



బాస్మతేతర బీయ్యంలో బారు రకాల కు పెరగనున్న ఎగుమతి అవకాశం :

రాయచూరు 23.7.2013
వరి సాగు చేసే రైతులకు దేశ వ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తునందున , వరి సాగు విస్తీర్ణం బాగా పెరుగుతుంది ,ఎగుమతికి ప్రపంచ వ్యాప్తంగా బాగా అవకాశం ఉన్న బారు రకాలు అనగా ఐ అర్ 64, ఐ అర్ 36, ఎమ్ . టి . యు 1010, రకాలను పండించినందున , సన్న రకాలతో పోలిస్తే  ఉత్పత్తి కర్చు తక్కువ పంట దిగుబడి ఎక్కువ , రైతుకు లాభదాయకంగత సంవత్సరం సన్న రకాలు దక్షిణాదిన పంట తక్కువ అయనందున వ్యాపారస్తులు ఉత్తరాది రాష్ట్రాలయన ఉత్తరప్రదేశ్ , బీహార్ , ఉత్తరాఖండ్ మహారాష్ట్ర  నుండి ధాన్యం మరియు బీయ్యం అత్యదిక ధరలకు  దిగుమతి చేసుకున్నందున, సంవత్సరం అక్కడి రైతులు సన్న రకాల సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నారు , కావున ప్రపంచవ్యాప్తంగా  మన దేశం నుండి ఎగుమతి అయ్యే బస్మతిఎతర రకాలలో సన్న బీయ్యం 10 నుండి 15 % అనేది చూసినప్పుడు , ప్రసుత పరిస్తితులలో బారు రకాలాకే  ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది ,ఈ విషయాన్నీ రైతు సోదరులు గమనించగలరు 

1 comment:

  1. నేను గత 3సం ల నుండి నేరుగా విత్తి సాగు చేస్తున్నాను

    ReplyDelete