Thursday, 25 September 2014

వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలతో సేంద్రియ ఎరువులు, by sri K V Krishna rao



వ్యవసాయ  ఉత్పత్తుల  అవశేషాలతో  సేంద్రియ  ఎరువులు

వ్యవసాయ  ఉత్పత్తుల  అవశేషాలతో  సేంద్రియ  ఎరువులు ముఖ్యం గా వరిమోళ్ళు , వరిగడ్డి , గోధుమ , వేరుశనగ పొట్టు , కూరగాయల  తోటల్లో  వచ్చే వ్యర్థ  పదార్థాలు  ఎదైనగాని  మొత్తం అన్నీ  కలిపి  వ్యవసాయ పంటల వ్యర్ధాలు భారత్లో దాదాపు  4 కోట్ల  టన్నుల  వ్యర్ధాలను  సేంద్రియ  పదార్ధంగా  మార్చుకో గల్గితే  దాదాపు  30  లక్షల  టన్నుల  N.P.K గా  భూమికి  అందించే  అవకాశాలున్నాయి. రైతులు  దీనిపై  ద్రిష్టిసారించాల్సిన   అవసరం  ఎంతైనా  ఉంది. పత్తి కంప ,  కంది  కంప,  జోన్నసోప్ప  , మొదలైనవి  పూర్వం  వంట  చెరకుగా  ఉపయోగించినప్పటికీ  ఇటీవల  కాలంలో పట్టణాలే  కాకుండా  గ్రామాలో  సైతం  వంట  గ్యాస్  ఉపయోగిస్తూనందు వల్ల  ఎక్కువ  శాతం  పోలాలోనే  వీటన్నిటిని అగ్నికి  ఆహుతి  చేయటం  జరుగుతోంది.  అయితే యిటీవల  పరిశోధనలో  తేలింది  ఏమిటంటే  అవశేషాలను భూమిలో  కలిపి  వేసినందు వల్ల  భారత దేశం  మొత్తం  మీద  4  కోట్ల  టన్నుల  పంటల  అవశేషాల  నుండి  25 లక్షల  టన్నుల  నత్రజని ,  4  లక్షల  టన్నుల  భాస్వరం ,  షుమారు  4  లక్షల  టన్నుల  పోటాష్  కు  సమానమైన  సేంద్రియ  పోషకాలు  లభ్యమౌతాయని  శాస్త్రవేత్తలు  చెప్తున్నారు .  ముఖ్య  పోషక  పదార్దాలే  కాకుండా సూక్ష్మ  పోషక  పదార్దాల  లభ్యత  కూడా  మెరుగవుతుందని  శాత్రవేత్తల  పరిశోధనలో   తేలింది . మీ మీ భూములలో  లభ్యమైయే  పంటల  వ్యర్ధాలను  తేలికగా  భూమిలో  కలపటానికి  ఇటీవల  ప్రవేశ  పెట్టిన  రోటోవేటర్ బాగా  ఉపయోగపడుతున్న  సంగతి  మనందరికి  తెలిసిందే  కొన్ని  ప్రాంతాల్లో  నత్రజనిని  స్తీరీకరించే మినుము , పెసర ,  అలసంద ,  జిగురు  గోరుచిక్కుడు  మొదలైన  పైరుల  సాగు  మరియు  అవశేశాల  వల్ల  కూడా  ఎంతో విలువైన  సేంద్రియ  పదార్ధాన్ని  మనం  భూమిలో  చేర్చినందు  వల్ల గత  30, 40  సంవత్సరాల నుండి  అధిక రసాయన ఎరువులు   వాడినందు  వల్ల  భూములన్నీ  నిస్సారమై   ప్రతి  సంవత్సరం  రసాయన  ఎరువుల  మోదాదు ను పెంచితే   తప్ప  దిగుబడి  రాని  పరిస్తితి  ఏర్పడింది.  అధిక  ఎరువుల  వినియోగం  వల్ల  పంటలపై  చీడపీడలు అధికంగా  అసించడంతో  క్రిమి  సంహారక  మందుల  వినియోగం పెరిగినందువల్ల   కోట్లాది  రూపాయల  విదేశి  మారక  ద్రవ్యాన్ని  ఖర్చు  పెట్టడమే  కాక  పర్యవరణానికి  ,  వినియోగదారుల ఆరోగ్యానికి ,  ఎంతో  హానికారకం  అయింది, మన  దేశ  వ్యవసాయ  ఉత్పత్తులలో  కూడా  క్రిమిసంహారక  అవశేషాల  వల్ల  ఎగుమతులకు  అవరోధం కలుగుతోంది . ఒకనాడు  పశువుల  పెంపకం  చేపట్టి  వ్యవసాయ  ఉత్పత్తుల  అవశేషాలను  పశువుల కు  మేతగా  మేపి వాటి  ద్వారా  వచ్చే  పశువుల  ఎరువును  పొలాల్లో  వినియోగించి  అతి  తక్కువ  ఖర్చు  తో  సేంద్రియ  పంటలు  ఉత్పత్తి   చేసి   వినియోగదారుల  ఆరోగ్యానికీ    పర్యవర్యవరణ  కాలుష్యం  లేకుండా  రైతన్నలు  చూడగలిగారు . అయితే  అది  నిన్నటి  మాట   ప్రస్తుత  పరిస్తితులలో ,  వ్యవసాయం  గిట్టుబాటు  కాకపోవటం  గ్రామీణ  ప్రాంతాల నుండి రైతులు పట్టణాలకు  వలస  పోవడం  వల్ల  గ్రామీణ  ప్రాంతాలలో  ప్రతి  రైతు  పశువుల  పాలన  అసాధ్యమైనందున మరియు  పశువులలో   అధిక  పాల  ఉత్పత్తినిచ్చే  సంతతి  పెరిగినందు  వల్ల నూ    వ్యవసాయంలో  యంత్ర పరికరాల   వాడకం  పెరిగినందు  వల్ల  కుడా  పశువుల  సంఖ్య  తగ్గుతూ  వస్తుంది .  అది  కుడా  వ్యవసాయ ఉత్పతుల  అవశేషాల  వినియోగం  తగ్గడానికి  కారణం . యిందు  వల్ల  ప్రతి  రైతు  మీ మీ  భుములలోని  పంటల  అవశేషాలను  అగ్ని కి  ఆహుతిచేయ్యకుం డా  (  ప్లాస్టిక్ ,  గాజు  పెంకు ,  తప్ప )  పంటల  అవశేషాలను  భూమిలో కలిపి  దాన్ని  సేంద్రియ  పదార్ధంగా  మార్చటానికి  ప్రయత్నించాలి . చౌక గా  దొరికే  రాక్ ఫాస్ఫేట్   గాని ,  సింగిల్ సూపర్  పాస్పేట్  కాని  చల్లినందువల్ల  పంటల  అవశేషాలు   త్వరగా  చివికి సేంద్రియ పదార్థంగా మారి  భూములను  సారవంతం గా మార్చు తాయి . మన  భూముల  సారవంతంగా  మారితే తప్ప  వ్యవసాయం  లాభసాటి గా  మరే  అవకాసం  లేదు .  అయితే  ఈనాడు  చాలా మంది  సాగుదారులు  కౌలు  రైతులే  కావటం ,  మరుసటి  సంవత్సరం  ఆ  చేను  వారికే   కౌలు  కు  లభిస్తుందో , లేదో  తెలియక  పోవడం  వల్ల  తాత్కాలికంగా  రసాయన  ఎరువులు  వినియోగించటం  వల్ల  వారూ  నష్ట పోతున్నారు  .  ఈ  విషయాన్ని  గమనించి  భూస్వాములు కూడా  భుసారవంతాన్ని పెంచటానికి సేంద్రియ ఎరువుల వినియోగించే     కౌలు  రైతులకు  రాయితీ  కల్పించినందు  వల్ల  సత్పలితాలను  పొందవచ్చు .  ఇటీవల పంటల  అవశేషాలతో  కొన్ని  యంత్రాల  సాహయంతో  తెల్ల  బొగ్గు  అనబడే  brikets  ను  తయారుచేసి  వంట చెరకు గా  పరిశ్రమలలో   వియోగిస్తున్న   విషయం   కూడా   మనకు   తెలిసిందే .  అయినప్పటికి  నిరంతరం  పెరుగుతున్న జనభా ,  తరుగుతున్న ,  సాగు  భూమిని  దృష్టి లో  పెట్టుకున్నప్పుడు  భూమి లో  సేంద్రియ  పదార్ధాన్ని 2 నుంచి 3  శాతానికి  పెంచితే  తప్ప  రాబోయే  రోజులాలో  పెరుగుతున్న  జనాభా కు  ఆహార  పదార్ధాలను  అందించ  లేమనే విషయాన్ని  గమనించి  అందుబాటు లో  ఉన్న  పంటల   అవశేషాలను  సేంద్రియ  పదార్ధంగా  మార్చేందుకు  రైతులకు తగిన  సలహాలు  సూచనలు  చేస్తూ  అందుకు  కావలసిన  పరికరాలకు  పెద్ద  రైతు ,  చిన్న  రైతు  అనే  తారతమ్యం లేకుండా  సబ్సిడీ  రేటు  పై   యంత్ర  పరికరాలను  ప్రభుత్వం  అందించినప్పుడే  భూములు  సారవంతమై  ప్రజల ఆరోగ్యం ,  పర్యావరణ  కాలుష్యం లేకుండా కాపాడుటమే కాక    పరోక్షంగా   విదేశి   మారక   ద్రవ్యాన్ని   కూడా   పొదుపు  చెయ్యగలం .

Friday, 19 September 2014

V seshubabu , kunderu, kankipaadu mandalam , gaari pusa punjab 1509 basmati field 30 days old , pictures taken on 18.9.2014

SRI V.SESHUBABU, PUSA 1509 BASMATI FARMER, AT KUNDERU , KANKIPAADU MANDALAM , KRISHNA DIST, AP




రైతులకు చేదు వార్త

KVK రావు : 19.9 .14 , రాయచూరు , సమయం 6.13 pm  
రైతులకు చేదు  వార్త :
ఈశాన్య భారత దేశం లో రోడ్లు మరియు  రైల్వే లైన్లు ఇటీవల కురిసిన భారి వర్షాలకు బాగా దెబ్బ తిన్నందున  అక్కడి ప్రజలకు  ఇబ్బంది పడకూడదు అని ఇవాళ్ళ కేంద్ర ప్రభుత్వం  పక్క దేశమైన మయన్మార్  నుండి లక్ష టన్నుల  బియ్యం  దిగుమతి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంది , దీనివల్ల  రూబోయే రోజుల్లో ధాన్యం  ధర పైన ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి , అసలే భారి  వర్షాల వల్ల  పంట నష్టం జరిగి రైతాంగం    పీకల లోతు కష్టాలలో ఉంటె ..ఈ నిర్ణయం వల్ల మాత్రం రైతులకు తీవ్ర  నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ...1990 తరవాత  భారత దేశం  దిగుమతి చేసుకోవడం ఇదే మొదటి సారి , గత సంవత్సరం రికార్డు స్థాయి లో కోటి టన్నులు దాక ఎగుమతి చేసిన  ప్రభుత్వం  ఈ దిగుమతి చర్య వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే  ఉంది కనుక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారత ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలకు మన బియ్యన్నే తరలిస్తే రైతులకు మేలు చేసినవారు అవుతారు .ఈ విషయాన్నీ ప్రధాని మంత్రి గారి దృష్టి కి తీసుకు వెళ్ళడం జరిగింది , జై హింద్ 


http://profit.ndtv.com/news/economy/article-india-importing-over-100-000-tonnes-on-temporary-supply-squeeze-668166

Sunday, 14 September 2014

guar article 14.9.2014 , జిగురు గోరుచిక్కుడు పైన వ్యాసం



జిగురు గోరు చిక్కుడు 2012 నుండి పత్రికలు,టివి లు మొదలైన ప్రచార సాధానలలో  రావటం వల్ల చాలా మంది రైతులలో ఆసక్తి రేపింది. ఆసక్తి రేపి ఎంతో ఆశగా సాగుచేపట్టిన రైతులను  అంతే నిరాశపర్చిన  పంటగా చెప్పవచ్చు. కారణం 2012 లో క్వింటా గింజల రేటు ౩౦ వేల రూపాయల వరకు పెరిగి జిగురు ధర క్వింటాకు లక్ష రూపాయల దాకా పెరగడంతో దక్షణ భారత దేశంలోని అనేక మంది రైతులు ఈ పంట పై ఆసక్తి పెరిగి  కిలో విత్తనం 600 ల రూపాయల వరకు కొనుగోలు చేసి ఈ పంట సాగుచేయటం జరిగింది. Commodity ఫ్యూచర్ ట్రేడింగ్ లో ఈ పంటను చేర్చినందు వల్ల రైతుకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో కామోడిటి లో ఈ పంటను కూడా చేర్చటం జరిగింది. అయితే కొంత మంది పెద్ద వ్యాపారుల మాయజాలంతో కృత్రిమంగా రేటు పెరిగి వ్యాపారస్తులకు కోట్లాదిరూపాయల లాభం చేకుర్చింది. అయితే రైతులకు మాత్రం చేదునే మిగిల్చింది.ఇటీవల కేంద్ర ప్రభుత్వం commodity  market  లో కృత్రిమంగా రేటు పెంచిన వారిపై  చర్య తీసుకుంటూ 100 కోట్ల రూపాయల దాకా పెనాల్టి విధించినట్టు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా ఈ పంట సాగును దక్షిణ భారత రైతులకు పరిచయం చేసింది ఈ చర్యలే, లేకుంటే వందల సంవత్సరాల నుండి రాజస్తాన్ లో పశువుల మేతగా సాగు చేస్తున్న ఈ పంట 40,50 సంవత్సరాల నుండి వాణిజ్యపరంగా సాగవుతున్నా, మనకు పరిచయం ఇటివలే జరిగింది.ఈ గింజలలో వున్న జిగురు పదార్దాన్ని పరిశోధించి  వాణిజ్యపరంగా గత 50 సంవత్సరాల నుండి రాజస్థాన్లో జోద్పూర్ పరిసర ప్రాంతాలలో మిల్లులు స్థాపించి జిగురును వేరుచేయటం మిగిలిన వ్యర్ధ పదార్ధాలను పశువులు,కోళ్ళ దాణాలలోను ఉపయోగిస్తూ ఈ పంటను  వాణిజ్య పంటగా గుర్తించి కొన్ని మేలైన వంగడాలను కూడా శాస్త్రవేత్తలు రూపోదించటం జరిగింది. ప్రస్తుతం ఈ పంటను రాజస్థాన్ తో పాటు హరియాణ , గుజరాత్ లలో కూడా పండిస్తున్నారు. రాను రాను సహజమైన ఈ జిగురు వినియోగం పెరగడంతో కిలో గింజల ధర 5,6 రూపాయల నుండి 40 నుండి 50  రూపాయల వరకు పెరగడం జరిగింది. ఈ జిగురు వినియోగం అనేక రకాల పరిశ్రమలలోను , ఆహార పదార్థాలలో, ఔషద పరిశ్రమలలో ఉపయోగిస్తున్నప్పటికీ , ఇటీవల కొన్ని సంవత్సరాల నుండి పెట్రోలు ,సహజ వాయువుల వెలికితీతలో కూడా ఉపయోగిస్తునందున జిగురు అవసరం పెరగడంతో పాటు ధర కూడా పెరగడం దీని సాగు పెరిగింది.
 దీని సాగు వర్షాధారిత తేలికపాటి బీడు భూములతో మొదలై సారవంతమైన భూములలో ఎరువులు,పురుగు మందుల వినియోగంతో ఉత్పతిని పెంచాల్సిన  అవసరం కూడా ఏర్పడింది.దీంతో జిగురు తీసే మిల్లులు కూడా రాజస్తాన్ తో పాటు హరియాణ,గుజరాత్ లలో కూడా మిల్లులు స్థాపించి వేలకోట్ల రూపాయల విలువైన జిగురును ఎగుమతి చేసి వ్యవసాయ రంగంలోనే అత్యధిక ఎగుమతి ఉత్పత్తి గా మారిన ఈ పంట పై కేంద్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ పెట్టి వ్యవసాయ ఉత్పత్తులలో  commodity  లో చేర్చటం జరిగింది.ఈ పంట మన దక్షిణాదిన 2005 వ సంవత్సరంలోనే కడప,అనంతపూర్ జిల్లాలో ప్రవేశ పెట్టినప్పటికీ కొనుగోలుదారులు లేకపోవడం సరైన మార్కెట్ రేటు రైతుకు తెలియక పోవడం కూడా ఈ పంట పై ఆసక్తి తగ్గింది.ఏది ఏమైనప్పటికీ 2012 లో వచ్చిన కిలో 300 లా రూపాయల ధర మళ్ళి రైతులలో సాగు పై ఆసక్తి  రేపింది.అయితే సాగు విధానంలో గాని , సాగు చేపట్టవలసిన సమయంపై గాని సరైన అవగాహన లేక రాజస్థాన్ లోని  సాగు పద్ధతులనే  ఇక్కడ కూడా అనుసరించటం వల్ల ఎక్కువ మంది రైతులు ఈ పంటను సాగుచేసి నష్టపోవటం జరిగింది. గత ఒకటిన్నర సంవత్సరం నుండి రాజస్థాన్ నుంచి Dr  D . Kumar  మొదలైన శాస్త్రవేత్తలను పిలిపించటం వారి ద్వారా అనేక విషయాలను రైతుల అవగాహనకు తేవడం ముఖ్యంగా అనంతపూర్ , కడప, రాయచూరు  జిల్లాలో దీనిపై ఎక్కువ ప్రచారం జరిగింది, ఈ వ్యాస రచయత కూడా గుజరాత్ రాజస్తాన్ , హరియాణా  పర్యటించి  అక్కడి రైతులు శాస్త్రవేత్తల ద్వారా అనేక విషయాలను తెలుసుకుని రైతులకు సాంకేతిక పరిగ్య్ఞానాన్ని అందించటమే కాకుండా ఈ పంట ను gum గా మార్చే పరిశ్రమ స్థాపించ నట్లయితే ఈ పంట మనుగడ దక్షిణ భారత దేశం లో మళ్ళి ప్రశ్నార్ధకంగా మారె ప్రమాదాని గుర్తించి కర్ణాటక రాష్ట్రం లో రాయచూరు లో విశ్వ శాంతి ఆగ్రో ఇండస్ట్రీస్  అనే  పరిశ్రమ  స్థాపించడం  జరిగింది, కనుక రైతులు ఈ వాస్తవ పరిస్తితులను అర్ధం చేసుకుని మళ్ళి ఈ పంటను సాగు చేస్తున్నారు   
ప్రపంచంలో పండే పంటలో 80 శాతం మన దేశంలోనే పండించడం  ప్రపంచంలో వినియోగించే గమ్ము 20 శాతం మాత్రమే మన దేశంలో వినియోగిస్తూ  80 శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేసి విదేశి మారక ద్రవ్యాన్ని ఎక్కువగా ఆర్జించటం జరుగుతోంది . ఈ పంటపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా శ్రద్ధ చూపినట్లైతే వర్షాధారిత భూముల రైతులకు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా ఈ పంటను పండించవచ్చు అంతే కాకుండా ఈ పంట పండించిన భూములలో భూసారాన్ని గణనీయంగా పెరగడం గమనించ వచ్చు , అంతే కాక అడవి పందులు కోతులు మొదలైన అటవీ జంతువుల నుండి కూడా ఈ పైరుకు ప్రమాదం నష్టం లేదని తెలుస్తుంది, గుంటూరు,ప్రకాశం,నెల్లూరు జిల్లాల రైతులు ఎకరానికి 8నుండి 12 క్వింటాళ్ళ వరకు పండిస్తున్నారు. కర్నూలు,కడప,జిల్లాలో 2 నుండి 6 క్వింటాళ్ళ వరకు పందిస్తునారు.అటు తెలంగాణ రాష్ట్రం లో  కూడా 3 నుండి 8 క్వింటాళ్ళు  రైతులు  పండిస్తున్నారు.
సాగు విషయానికి వస్తే చవుడు లేని  , నీరు నిలువని ఎటువంటి నేలల్లో నైనా  ఈ పంట పండుతుది.అధిక తేమను అధిక చల్లదనాన్ని  తట్టుకోలేదు ఈ పంటలో ఇంతవరకు హైబ్రిడ్  రకాలు ఏమి రాలేదు , ఇందులో ముఖ్యంగా రెండూ రకాలు , 1, నిలువుగా ఏక కాండం తో పెరిగేది , 2 , కొమ్మలతో పెరిగేదిగా  చెప్పవచ్చు ,విత్తనం ఎకరానికి  మొదటి రకం  పది kg లు , రెండోవ రకం  ఆరు kg లు  వరకు సరిపోతుంది ..ఈ పంట 90 నుండి 110  రోజుల వరకు  రకాలను బట్టి కోతకు వస్తుంది , కనుక కోతకు ముందే  50 రోజులు వర్షం పడకుండా  మీ మీ ప్రాంతాలలో  ఆఖరి  వర్షాలను  గమనించి  విత్తుకోవచ్చు  ముఖ్యంగా  ఆగష్టు  , february  నెలలు  ఈ పంటను విత్తడానికి  అనువైనవి గా గమనిస్తున్నాం  ఎక్కువ మంది రైతులు  సాళ్ళ  పద్దతి లో   విత్తుతున్నారు  , సాళ్ళ మధ్య దూరాన్ని  12 అంగుళాల దూరం ఉండేటట్టుగా  విత్తుతున్నారు , ఈ పంటకు ఎరువులు  ఎక్కువగా  అవసరం లేదని     చెపుతున్నప్పటికీ  అధిక దిగుబడి  సాధించాలంటే వారి వారి భూసారాన్ని  అనుసరించి  సింగల్ సూపర్ ఫాస్ఫేట్ 100 kg లు, urea  25 kg లు, పోటాష్ 25 kg లు ఒకేసారి విత్తనం తోపాటు  విత్తినట్ట్ల్అయెతే  మంచిది, విత్తిన వెంటనే  మరుసటి రోజు  కలుపు నివారణకు పెండి methalin ఎకరానికి ఒక లీటర్ రెండు  వందల లీటర్ల  నీటిలో కలిపి స్ప్రే చేస్తే కలుపును అరికట్టవచ్చు ,
విత్తిన  25 నుండి ౩౦ రోజుల లోపల కాపు ప్రారంభం అవుతుంది కనుక అప్పటికి కాండం  8 నుండి 9 అంగుళాల ఎత్తు పెరిగి  అక్కడినుండి  కాపు  మొదలైతే  combined  harvestor తో  కొయ్యడానికి అనువుగా ఉంటుంది , అందువల్ల వేసే ఎరువులు  విత్తనంతో పాటు వేస్తె  మంచిది , విత్తిన 15 వ రోజు ఒక సారి  , 25 వ రోజు  ఒకసారి ౩౦ % జింక్ sulphate (ల్యాబ్ గ్రేడ్ ) లీటర్ నీటికి  2 గ్రాముల చొప్పున ౩౦ గ్రాముల urea  కలిపిన ద్రావణాన్ని పైరు పై పిచికారి చేసినందువల్ల దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది , ఈ పంట వర్శాధరితమే   అయేనప్పటికి  వేసవిలో వరి, మొక్కజొన్న , పత్తి  పంట కోసిన తరువాత దుక్కి దున్ని భూమి మెత్తగా దున్నుకుని  feburavary  మొదటి వారం లో  విత్తి నల్ల రేగడి నెల లో నీరు కట్టకుండా , రెండో సారి నీరు కట్టకుండా ఎకరానికి 5 క్వింటాళ్ళు  పండించటం జరిగింది , 4 % శాతం యౌరియా ద్రావణాన్ని వారానికి ఒక్కసారి పైరు పై చల్లి నల్ల నెలలో నీరు  కట్టకుండానే , ఎర్ర భూములలో రెండూ మూడు తడులు ఇచ్చి పండించటం జరిగింది . నల్ల రేగడి  నెలలో  నీరు కట్టినప్పుడు పైరు చనిపోవడం జరిగింది , చలి కాలం లో ఈ పైరు  పై బూడిద తెగులు  ఎక్కువగా కనపడింది , అయెతే ప్రారంభ దశలోనే  గమనించి  రెండూ  మూడు సారులు నివారణ చర్యలు  తీసుకున్నట్లతే  తేలికగానే నివారించవచ్చు , తక్కువ్బ నీటి వనరులు కలిగిన భుములలోను  ప్రత్తి  మొక్కజొన్న పంట తీసిన చోట, సమయం ఉన్నచోట ..ఈ పంట సాగును చేపట్టినట్లయితే   ఎకరం వరి పంటకు ఉపయోగించే నీరు షుమారు  5 నుండి 6 ఎకరాలను ఈ జిగురు  గోరు చిక్కుడు  సాగు చేయవచ్చు. వేసవిలో వరి పంట సాగు చేసే రైతులు ముఖ్యంగా బోరు నీరు, పరిమిత నీటి వనరులున్న రైతులు ఈ పంటను సాగు చేసినందువల్ల మంచి ఆదాయం పొదగలరు.ఏది ఏమైనా గోరుచిక్కుడు ఉత్పత్తుల ఎగుమతి పైన  భారత ప్రభుత్వం ఆంక్షలు విదిచటం కాని స్వదేశి వినియోగదారులు విదేశాల నుండి దిగుమతి చేసుకొని ధరలను తగ్గించటం కానీ , మిగతా పంటల లాగా అవకాశం లేదు. కనుక రైతు సోదరులంతా మీమీ ప్రాంతాల అనుకూలతను బట్టి చిగురు గోరుచిక్కుడ సాగు చేపట్టండి. మార్కెట్ ను గురించి భయపడవలసిన పని లేదు. 2013 ఆగష్టు నుండి  దక్షిణ భారతంలోనే ప్రప్రధమంగా గోరుచిక్కుడు మిల్లును స్థాపించడమే కాక ,ఇప్పటివరకు  షుమారు 900 ల మంది రైతులు ఆంధ్ర , కర్ణాటక,తెలంగాణ,రాష్ట్రాల నుండి సరుకు తీసుకొచ్చారు.అలాగే 200ల మంది 50 కేజీ ల నుండి 10క్వింటాళ్ళ దాకా రైతులు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపారు. వారందరికీ బ్యాంక్ ద్వారా పేమెంట్ పంపటం జరిగింది. ప్రతి రోజు మా వెబ్ సెట్ లో kvkrao.blogspot.in ద్వారా ఏరోజుకారోజు మార్కెట్ ధర తెలియజేస్తున్నాం.ధర తక్కువ ఉన్నప్పుడు మన పంటను అమ్మే అవసరం లేదు , శనగ పంట విదేశాల నుండి దిగుమతి కావడం, ఎగుమతిని ప్రభుత్వం నిషేదించడం  వల్ల ధర పెరగడంలేదు. కనుక శనగ వేసే రైతులు 50 శాతం అయినా  రైతులు శనగకు బదులుగా ఈ పంటను సాగు కు చేపట్ట వలసినదిగా కోరుతున్నాము.   

Friday, 12 September 2014

మొక్కజొన్న పంట లో పోషణ లోపాలు వాటి వివరాలు

IARI , పూసా  వారి సౌజన్యం తో , మొక్కజొన్న పంటలో  పోషకాల  లోపం  పైన చిత్రం లో గమనించవచ్చు , తద్వారా తగు నివారణా చరియలు తీసుకోవచ్చు

Wednesday, 10 September 2014

my tour snaps

వ్యసాయం నష్టమంటూ భూమాతను వదిలి  పట్టణాల వైపు పరుగులు తీస్తున్న  యువత లో వస్తున్న  మార్పుకు నిదర్శనమే  ఈ యువ రైతు, విద్యావంతుడైన శ్రీ యలమంచిలి వాసు గారు (హోస్పేట , కర్ణాటక ) నూతన పద్దతులలో  ఆధునిక యంత్ర పరికరాల  ఉపయోగంతో , ఉద్యానవన పంటలను సాగు చేస్తున్న ఆదర్శ రైతు

నూతన పద్దతులలో  ఆధునిక యంత్ర పరికరాల  ఉపయోగంతో , ఉద్యానవన పంటలను సాగు చేస్తున్న ఆదర్శ రైతు

ఆదర్శ యువ రైతు శ్రీ వాసు

బాసుమతి  విత్తిన చేను (కోడూరు మండలం , నరసింహా పురం గ్రామం లో ) పరిశీలిస్తున్న K V K , శ్రీ D  శ్రీనివాస్ గారు . శ్రీ k.సుబ్బారావు గారు  , శ్రీ  డాక్టర్ కోటేశ్వర్రావు  గారు , మరియు ఇతర రైతులు 

తల్లి తండ్రులే  భారమై వ్రుద్దాశ్రమాలకు  పంపుతున్న  ప్రస్తుత రోజులలో తండ్రి గారి  కాంస్య విగ్రహాన్ని  ప్రతిష్టించి మాతృదేవోభవ పితృదేవోభవ అన్న  భారతీయ సంస్కృతికి  సజీవ ఉదాహరణ  డాక్టర్ కోటేశ్వర్ రావు గారు

బాసుమతి సాగును గురించి తెలుసుకుని  మా వద్ద  విత్తనం తీసుకుని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం , కుందేరు  గ్రామం లో శ్రీ వి . శేషుబాబు గారు పూసా  పంజాబ్ బాసుమతి  1509 , మా సూచనలను అనుసరించి లేత నారు నాటి పొలానికి ఆరుతడులు  మాత్రమే ఇస్తూ నాటిన  పదిహేడు రోజులలో  పదిహేడు కర్రల దుబ్బు  చేయించిన ఆదర్శ రైతు : ఫోన్ :9393818199

పుజ్యనీయులు  శ్రీ పాపారావు గారిని  వారి స్వగ్రామం లో  గుంటూరు జిల్లా  బాపట్ల  మండలం  నరసాయ పాలెం  గ్రామం లో  మిత్రులు కర్రి సుబ్బారావు గారు , శ్రీ D శ్రీనివాస్ గార్లతో కలిసి పత్తి పంట లో  స్వర్ణ యుగం 1970  నుండి 80  వరకు ఒక క్వింటాల్ పత్తి అమ్మి రెండు తులాల బంగారం కొనుకున్న  ఆ  అనుభవాలను వారితోనే పంచుకున్న  మధుర క్షణాలు : 6.9.2014 

స్వాతంత్రం  వచ్చినా  ఎన్నో ప్రణాలికలు  రూపొందించినా , రాజకీయ ప్రాభల్యం కలిగిన ఎ కొంతమంది వ్యక్తులకో తప్ప  మాలాంటి ఇంకా ఎంతో మంది  నిరుపేద మత్స్య కారుల జీవితాలలో  ఎ మాత్రం వెలుగు రాలేదని  వాపోతున్న  చీరాల పక్కన  వాడరేవు గ్రామ మత్స్యకారులు ( మోడీ గారి  ఆదార్  ద్వారా అయినా  ఇలాంటి వారందరికీ రాజకీయాలకు అతీతంగా న్యాయం జరుగుతుందని  ఆశిద్దాం )   

బోయన పల్లి గ్రామం ,  మిడ్జిల్  మండలం , మహాబూబనగర్ జిల్లా లో 10 mw ప్రైవేటు   సోలార్ పవర్ ప్లాంట్ , కరెంటు కొరతతో తల్లడిల్లుతున్న రైతన్నల కష్టాలను తీర్చే దిశగా ఇప్పటికైనా పాలకులు నిర్ణయాలు తీసుకోవడం  సంతోషించాల్సిన విషయం , దేశ సమగ్రాభివ్రుద్దికి మూలమైన విద్యుత్ ఉత్పత్తికి  సౌర శక్తిని  ఉపయోగించి , గుజరాత్ ను ఆదర్శంగా తీసుకుని దేశంలోని అన్ని ప్రభుత్వాలు కదలాలి

నల్గొండ జిల్లా మిరియాల గూడ మండలం పాలూరు గ్రామంలో సురేష్  అనే ఆదర్శ రైతు చేపట్టిన  బాస్మతి సాగు పరిశీలిస్తున్న KVK