Wednesday, 25 June 2014

దొంగల భీభత్సం .... తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దొంగల భీభత్సం .... తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
ఇటీవల కాలం లో దొంగల దోపిడీ రోజు రోజు విపరీతంగా పెరుగుతోంది ,సామాన్యుడి నుండి  పోలీస్ , రాజకీయ నాయకుల మరియు న్యాయమూర్తుల ఇళ్ళ లోను  , విశ్రాంత మిలటరీ అధికారుల ఇళ్ళలోనూ  . నగల దుకాణాలలో , ఆఖరికి దేవాలయాల్లో కూడా నిర్భీతిగా దోపిడిలు  జరుగుతున్న  విషయం మనందరికీ  తెలిసిన విషయమే , అయెతే  దొంగల బారినుండి  మనల్ని మనం  రక్షించు కోవడం లో మన భాద్యత కూడా చాలా ఉంది , అందుకు  తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి  రాయచూరు నేతాజీ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్  శ్రీ చంద్రశేకర్ గారు నిన్న , అనగా 25.6.14 న  జన జాగృతి  సమావేశం లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను  గూర్చి  అనేక విషయాలను తెలియజేసారు , కేవలం వెయ్యి  మంది ప్రజలకు ఒక పోలీస్ వంతున ఉన్న ఈ తరుణం లో ప్రజలు కూడా ఈ దొంగతనాలను అరికట్టడానికి సహకరించవలసిందిగా కోరుతూ  , అనుమానాస్పద వ్యక్తులు  వీధుల్లో తిరుగుతూ ఉంటె పోలీసులకు తెలియజేయ్యవలిసిందిగా  చెప్పారు.
అయెతే  నేను తెలియజేసేది ఏంటి అంటే  ,
 ప్రతి ఇంటికి  తప్పనిసరిగా  CC టీవీ  కెమెరాలు అమర్చుకోవాలి ,
అలాగే  కనీసం మీ పక్క ఇంటి వారి ఫోన్ నెంబర్  మీ దగ్గర ఉండాలి ,
siren  అలారం అమర్చుకోవాలి
మెయిన్ డోర్స్  కి ఇనుప గ్రిల్ డోర్ , దాని తాళం చెవి లోపలి ఉండేటట్టు  అమర్చుకోవాలి
అపరిచిత సేల్స్ గర్ల్స్ బాయ్స్  ని  వస్తువులు కొనడానికి  పిలవకండి
బాగా తెలిసిన , లేక  పూర్తీ  వివరాలు ఫోటో  ఉన్న పని మనిషి ని పని లో పెట్టుకోండి
పనిమనుషులకు  తెలిసేలా  మీ ఇంట్లో నగలు అవి పెట్టుకోకండి .
Theft ఇన్సురన్సు  తప్పనిసరిగా చేయించు కుంటే  మంచిది .

ఇటువంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు  తీసుకుంటే  , మనం దొంగల బారినుండి  బైట పడగలం
జై  హింద్.

No comments:

Post a Comment