Tuesday, 10 February 2015

రైతు సోదరులారా



రైతు సోదరులారా

పెసర  మినుములు కందుల  ధరలు  ప్రోత్సాహకరంగా  ఉన్నాయి , పసుపు  నువ్వులు  కూడా మంచి ధర  పలుకుతున్నాయి , ప్రత్తి ధర మందంగా  ఉంది , అలాగే జిగురు గోరుచిక్కుడు ధర కూడా ముడి చమురు ధర  పథనం తో  gum ధర 140  నుండి 85 రూపాయలకు  పడిపోయింది ,నాణ్యమైన  గింజలనుండి  ఒక క్వింటాల్  గింజలకు  28 నుండి  ౩౦ kg ల వరకు  gum తియ్యవచ్చు , దేన్ని బట్టి  గింజల  ధర ఇంటర్నెట్  చూసే రైతు సోదరులు  తెలుసుకోగలరు , www.ncdex.com    లో ఎప్పటికప్పుడు ధరను ప్రకటిస్తూ  ఉంటారు , ప్రతి నెల 20 వ తారీకు వరకు ఆ ధర  వర్తిస్తుంది , ప్రస్తుత ధరల పతనం  వల్ల  వేసవి పంటగా పండించే గుజరాత్ , మహారాష్ట్ర , కర్ణాటక  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాలలో పంట విస్తీర్ణం  బాగా  తగ్గినట్టు తెలుస్తుంది , కనుక ఇప్పటికే  వేసిన రైతులు ఆందోళన పడనవసరం  లేదు మే  జూన్  నాటికి  ధర  4 నుండి 5  వేల స్థాయికి  చేరే అవకాశం  ఉన్నట్టు  తెలుస్తుంది  అలాగే  బాసుమతి  కూడా  ఎక్కువగా వినియోగించే  అరబ్ దేశాలు  ముడి  చమురు ధరల పథనం  వల్ల  బాసుమతి  కొనుగోలు కూడా మందంగా  ఉంది , గత  వారం    దుబాయ్ లో జరిగిన  అంతర్జాతీయ  ఆహార వ్యాపార సమ్మేళనం లో  కొంత  ప్రగతి  కనిపించింది , బాసుమతి బియ్యం  అమ్మకాలు పెరిగి , ధర మార్చ్ ఏప్రిల్  లో వచ్చే అవకాశాలు  ఉన్నాయి  

                                                                    ఇట్లు   KVK

No comments:

Post a Comment