రైతు సోదరులారా
పెసర మినుములు కందుల ధరలు
ప్రోత్సాహకరంగా ఉన్నాయి ,
పసుపు నువ్వులు కూడా మంచి ధర
పలుకుతున్నాయి , ప్రత్తి ధర మందంగా
ఉంది , అలాగే జిగురు గోరుచిక్కుడు ధర కూడా ముడి చమురు ధర పథనం తో
gum ధర 140 నుండి 85 రూపాయలకు పడిపోయింది ,నాణ్యమైన గింజలనుండి
ఒక క్వింటాల్ గింజలకు 28 నుండి
౩౦ kg ల వరకు gum తియ్యవచ్చు ,
దేన్ని బట్టి గింజల ధర ఇంటర్నెట్
చూసే రైతు సోదరులు తెలుసుకోగలరు , www.ncdex.com లో ఎప్పటికప్పుడు ధరను ప్రకటిస్తూ ఉంటారు , ప్రతి నెల 20 వ తారీకు వరకు ఆ ధర వర్తిస్తుంది , ప్రస్తుత ధరల పతనం వల్ల
వేసవి పంటగా పండించే గుజరాత్ , మహారాష్ట్ర , కర్ణాటక ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాలలో పంట విస్తీర్ణం బాగా తగ్గినట్టు తెలుస్తుంది , కనుక ఇప్పటికే వేసిన రైతులు ఆందోళన పడనవసరం లేదు మే
జూన్ నాటికి ధర 4
నుండి 5 వేల స్థాయికి చేరే అవకాశం
ఉన్నట్టు తెలుస్తుంది అలాగే
బాసుమతి కూడా ఎక్కువగా వినియోగించే అరబ్ దేశాలు
ముడి చమురు ధరల పథనం వల్ల
బాసుమతి కొనుగోలు కూడా మందంగా ఉంది , గత
వారం దుబాయ్ లో జరిగిన అంతర్జాతీయ
ఆహార వ్యాపార సమ్మేళనం లో
కొంత ప్రగతి కనిపించింది , బాసుమతి బియ్యం అమ్మకాలు పెరిగి , ధర మార్చ్ ఏప్రిల్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి
ఇట్లు KVK
No comments:
Post a Comment