Saturday, 22 November 2014

వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం , కారణాలు :

వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం , కారణాలు :

బూమికి సీలింగ్ ఉంది , కాని డబ్బుకు సీలింగ్ లేదు , చరాస్తులకు సీలింగ్ లేదు , బంగారానికి అంతకంటే సీలింగ్ లేదు , శ్రిమంతులంతా  వారి సంపదలో  నాలుగోవ వంతు  బంగారం నిలవగా  మారుస్తున్నట్టు  తెలుస్తుంది , అందుకోసం కోట్లాది రూపాయల బంగారం దిగుమతి తో  విదేశీ మారక ద్రవ్య కొరత తో  విలవిల లాడుతున్న  కేంద్ర ప్రభుత్వం , విదేశీ మదుపు దారుల కోరికలుకు అనుగుణంగా  భారత దేశంలో ఆహార పదార్థాల ద్రవోల్బణo  పెరకకుండా కొన్ని కఠిన చర్యలు  తీసుకోవాల్సి వస్తుంది , కనుక విదేశీ వస్తువుల వినియోగం ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేశం స్వావలంబన  సాధిస్తుంది , ఈనాడు రైతుల చేతుల్లో ఉన్నది ఉత్పత్తి కర్చును  ఎంతమేరకు సాధ్యమైతే  అంత మేరకు తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి , ఎరువులు పురుగు మందులు  దిగుమతులను  తగ్గించుకునే లా సాంప్రదాయ పద్దతులలో సేంద్రియ వ్వసాయం వైపు  మళ్ళి  ఉత్పత్తి కర్చును బాగా తగ్గించినప్పుడే  రైతు  అప్పులపాలు కాకుండా ఉంటాడు , వ్యవసాయాన్ని వదిలి ఈ దేశంలో ఉన్న 80 కోట్ల మంది వ్యవసాయ దారులకు  ప్రత్యామ్న్యాయం  చూసుకోవడం  ఆచరణ సాధ్యం కాని విషయం, ప్రతి వృత్తిలోను  కష్టాలు నష్టాలు  అనివార్యం , అయేనప్పటికి  వారంతా  ధైర్యంగా  ముందుకు సాగుతున్నారే కాని ఆత్మహత్యలు చేసుకోవడంలేదు కనుక రైతు సోదరులారా సాటి రైతు సోదరులకు  ధైర్యాన్ని చెప్పడం , మీకు తెలిసిన విధంగా వారిని  ఓదార్చడం చెయ్యాలి. మన రైతులు ఉత్పత్తి చేసిన స్వదేశీ  ఉత్పత్తులనే  ఉదాహరణకు కొబ్బరి నీరు , మజ్జిగ , నిమ్మరసం , పళ్ళ రసాలు వాడుతూ  సాటి రైతులకు  సహకరిద్దాం , స్వదేశీ  ఉత్పత్తుల వినియోగం తోనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది , వ్యవసాయ ఉత్పత్తులకు అధిక రేట్ ఆశించి నిరాశ పడవద్దు , మన మన  ఉత్పత్తులను  నేరుగా  వినియోగ దారుడికి  అందించే మార్గాన్ని ఆచరిద్దాం 

Monday, 17 November 2014

లక్ష్య సాధన వైపు  నీ  ప్రయాణం  సగంలో ఆపకు , ముందుకు వెళ్ళినా  వెనక్కు వచ్చినా  దూరం ఒక్కటే  అని గమనించి   ముందుకే సాగు.  

ASWACH BHARAT





ఇదేదో  జాతర  అనుకుంటున్నారా !!  అయెతే మీరు తప్పు లో కాలేసినట్టే , ఇది రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం  వారు  15.11 .2014  న లక్షలాది రూపాయలు  కర్చుపెట్టి   జరిపిన    కృషి మేళా లోని  ఈ అస్వచ్చతా  దృశ్యం సాక్షాత్తు  గౌరవనీయులైన  మన దేశ ప్రధాని గారి అభ్యర్దన కు  కూడా  స్పందించని  విశ్వవిద్యాలయ యంత్రాంగమే  ఇంత  నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే  , సాధారణ పౌరులు ఏవిధంగా ప్రవర్తిస్తారు , నిజానికి ఈ సంఘటన  సిగ్గుచేటు , ఇకముందైనా  దేశం లో ఇలాంటి సంఘటనలు  పునరావృత్తం  కాకుండా  చూసుకోగలిగితే భారత దేశం ప్రపంచానికి  స్వచ్చ భారత్  సందేశం సాకారం  అవుతుంది. జై హింద్  

Tuesday, 4 November 2014

రైతు సోదరులకు

కోట్లాది మంది రైతు మిత్రులు వ్యవసాయం లో ఉన్నటువంటి వారు అందరూ  , శాస్త్ర సాంకేతిక పరిగ్య్ఞానం , నిత్యం రైతులు పండించే పంటల వివరాలను ఎప్పటికప్పుడు  సరళమైన తెలుగు బాషలో  మనకందిస్తున్న  వ్యవసాయ మాసపత్రికలు  తెలుగు లో ఉన్నవే చాలా తక్కువ , ఈ పత్రికలను  మన రైతు  సోదరులు అందరూ  తప్పనిసరిగా చదివి మన తోటి రైతుల  మరియు శాస్త్రవేత్తలతో నిరంతరం సంప్రదిస్తూ కర్చు తక్కువ తో  ఎక్కువ దిగుబడులు లాభసాటి వ్యవసాయం  చేద్దాం
కే  వి కృష్ణా రావు , IARI  ఢిల్లీ  వారి  ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డు ,కృషి పండిట్  అవార్డు, శరద్ పవార్ ద్వారా ఫార్మర్ సైంటిస్ట్  అవార్డు  గ్రహిత