రైతు సోదరులారా
దక్షిణ భారత దేశం , మహారాష్ట్ర లో విదర్భ అనావ్రిష్టి తో రైతు సోదరులంతా దిక్కు తోచని పరిస్తితిలో ఉన్నారు , కొన్ని ప్రాంతాలలో రైతులు ఆత్మ హత్యలు కూడా చేసుకుంటున్నారు , ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని , ధైర్యంగా ఉండాలని నాయకులంతా చెప్తూ ఉంటారు , కరువు కష్టాలు , అప్పుల బాధలు , ఇవన్ని ఒక్కసారిగా చుట్టుముడితే ఆ వ్యక్తీమనో స్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య వైపు మళ్లుతారు ..వీటిని నివారించటానికి ప్రభుత్వాలు నాయకులు , అధికారులు ఆత్మహత్యకు ముందుగా ప్రయత్నం చెయ్యడం సాధ్యపడదు , దిన్ని నివారించాలి అంటే చుట్టుపక్కల ఉన్న మిత్రులు , భందువులు వీరే నివారించగలరు అప్పు చెయ్యడం తప్పని పరిస్తుతలోకి కి భారత దేశ రైతు నెట్టబడ్డాడు , కరువులు , సమస్యలు , బాధలు ఇవే రైతు కు పర్యాయ పదం , మన తాత ముతాతలనుంచి ఇలాంటి ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని భవిష్యత్తు పైన ఆశతో ముందుకు నడిచారు , వారి వారసులమైన మనం అదే ధైర్యంతో ముందుకు నడుస్తూ మన పిల్లలను వ్యవసాయ రంగం నుండి వేరే రంగాల వైపు మళ్ళించి వారి జీవితాలైనా బాగు పడాలంటే మనం ధైర్యంగా నిలబడక తప్పని పరిస్తితులలో ఉన్నాం , ఇప్పటికే ఎంతో మంది రైతులు తరతరాలుగా వస్తున్న వారి వృత్తిని వదిలి , ఆస్తులను అమ్మి వారి పిల్లలను విద్యావంతులను చేసారు , వేరే రంగాల వైపు మళ్ళిస్తున్నారు , వారంతా ఉన్నంతలో బాగా బ్రతుకుతున్నారు .
దేశ సంపదలో నూటికి 20 శాతమే వస్తున్న వ్యవసాయ రంగం పైన ఆధారపడిన ప్రజలు 70 శాతం ఉండటంతో ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వడం ఆసాధ్యం అవుతుంది , అంతేగాక 1994 లో అప్పటి ప్రధాని pv నరసింహారావు గారు ప్రపంచ వాణిజ్య మండలి లో భారత దేశాన్ని సభ్య దేశంగా మార్చడం , సరళీకృత ఆర్ధిక విధానాలవల్ల విలాస వస్తువుల దిగుమతులు పెరగటం ప్రజలంతా స్థోమత ఉన్నా లేకున్నా వాటి వైపు ఆకర్షితులవడం , ఆనాటి ఉమ్మడి కుటుంభ వ్యవస్థ పథనం కావడం , అనేక విషయాలలో నాటికి నేటికి వచ్చిన మార్పులో ఆత్మహత్యల వైపు మొగ్గుచూపడం ఎక్కువయ్యింది , ఇది పరిష్కారం కాదని అలాంటి వ్యక్తులను చుట్టూ సాటి వ్యక్తులు ధైర్యాన్ని చెప్పి ఆత్మహత్యలను నిరోధించడానికి ప్రయంతం చెయ్యాలి .
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి తక్కువగా ఉన్న పంటలకే ధరలు బాగా వస్తున్నాయి , పప్పులన్ని ధరలు పెరిగి కిలో వంద రూపాయలు పైనే ఉన్నాయి , మషాలా దినుసుల పంటలైన మిర్చి , పసుపు , జీలకర్ర , అల్లం వెల్లుల్లి మిరియాలు మొదలైన పంటల ఉత్పత్తులకు మంచి ధరలు ఉన్నాయి , అందుబాటులో ఉన్న సామాచార సాధనల ద్వారా వాతవరణ పరిస్తితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన పంటలను పండిస్తూ కర్చులను ఎంత సాధ్యపడితే అంత తగ్గించుకుంటు అప్పుల ఊబి నుంచి బైట పాడటానికి ప్రయత్నం చెయ్యవచ్చు
సెనగలు : 4500
మొక్కజొన్నలు : 13 నుండి 14 వందలు
ఆముదాలు :3500 నుండి 40 00
ఎండు మిర్చి 9500 నుండి 10 000
గోరుచిక్కుడు 25 00 నుండి ౩౦00
రానున్న season లో కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా కొనుగోలు చెయ్యటాన్ని నిలిపివేసింది