Thursday, 27 August 2015

మినుమల పంట లో అత్యదిక దిగుబడి సాదిస్తున్న రాయలసీమ రైతు శ్రీ పుల్లయ్య చౌదరి

మినుమల పంట లో  అత్యదిక  దిగుబడి  సాదిస్తున్న  రాయలసీమ  రైతు  శ్రీ  పుల్లయ్య  చౌదరి , గుంపర మానదిన్నె గ్రామం , నంద్యాల. 
పంట , విత్తన , మరియు సాగు పద్దతులను  తెలుసుకోవడానికి  సంప్రదించగలరు 
09502421116, 08466021355
:

Wednesday, 26 August 2015

కరువు పరిస్తితుల నేపధ్యం లో ప్రత్యామ్నాయ పంటలు

దేశం లో చాలా ప్రాంతాలలో  ప్రస్తుతం  నెలకొన్న  కరువు పరిస్తితుల  నేపధ్యం లో   ప్రత్యామ్నాయ  పంటల వైపు  రైతులు దృష్టి సారించాసిన అవసరం  ఉంది ....
జిగురు గోరు చిక్కుడు  గింజల కు ప్రస్తుతం  దానికి సహజ ధరల స్తితికి  వచ్చి చేరాయి (క్వింటాల్  2900 నుండి 3500 ) 

నంద్యాల  ఆళ్లగడ్డ  లో రైతులు  తెల్లజోన్న  బాగా విరివిగా పండిస్తున్నారు , ముఖ్యంగా రెండూ  varieties
మహింద్రా  మరియు  మిల్కీ white 

వరికి  నీరు అందని పరిస్తితులలో  గట్లను  నరికి , rotovator   తో నేలను  తయారు చేసి ఇటువంటి  తక్కువ నీరు అవసరం అయ్యే పంటలు  వేస్తె   రైతులకు  ఉన్నంత లో మేలు .

Thursday, 13 August 2015

రైతు సోదరులారా

రైతు సోదరులారా
దక్షిణ భారత దేశం  , మహారాష్ట్ర  లో విదర్భ   అనావ్రిష్టి  తో  రైతు సోదరులంతా  దిక్కు తోచని  పరిస్తితిలో  ఉన్నారు , కొన్ని ప్రాంతాలలో  రైతులు ఆత్మ హత్యలు కూడా చేసుకుంటున్నారు , ఆత్మహత్యలు సమస్యలకు  పరిష్కారం కాదని , ధైర్యంగా ఉండాలని  నాయకులంతా చెప్తూ ఉంటారు , కరువు కష్టాలు , అప్పుల బాధలు , ఇవన్ని  ఒక్కసారిగా చుట్టుముడితే  ఆ వ్యక్తీమనో స్థైర్యాన్ని  కోల్పోయి  ఆత్మహత్య  వైపు మళ్లుతారు ..వీటిని నివారించటానికి  ప్రభుత్వాలు  నాయకులు , అధికారులు  ఆత్మహత్యకు ముందుగా ప్రయత్నం చెయ్యడం సాధ్యపడదు , దిన్ని నివారించాలి అంటే  చుట్టుపక్కల ఉన్న మిత్రులు , భందువులు  వీరే నివారించగలరు  అప్పు చెయ్యడం తప్పని పరిస్తుతలోకి కి భారత దేశ రైతు నెట్టబడ్డాడు , కరువులు , సమస్యలు , బాధలు ఇవే రైతు కు పర్యాయ పదం , మన తాత ముతాతలనుంచి ఇలాంటి ఎన్నో సమస్యలను  ధైర్యంగా  ఎదుర్కొని  భవిష్యత్తు పైన ఆశతో  ముందుకు నడిచారు , వారి వారసులమైన మనం  అదే ధైర్యంతో  ముందుకు నడుస్తూ  మన పిల్లలను  వ్యవసాయ రంగం నుండి వేరే రంగాల వైపు మళ్ళించి  వారి జీవితాలైనా  బాగు పడాలంటే  మనం ధైర్యంగా  నిలబడక తప్పని పరిస్తితులలో  ఉన్నాం , ఇప్పటికే  ఎంతో మంది రైతులు  తరతరాలుగా వస్తున్న  వారి వృత్తిని వదిలి , ఆస్తులను  అమ్మి  వారి పిల్లలను విద్యావంతులను  చేసారు , వేరే  రంగాల వైపు మళ్ళిస్తున్నారు , వారంతా ఉన్నంతలో  బాగా బ్రతుకుతున్నారు .

దేశ సంపదలో  నూటికి  20 శాతమే వస్తున్న  వ్యవసాయ రంగం పైన ఆధారపడిన ప్రజలు 70 శాతం ఉండటంతో  ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వడం ఆసాధ్యం అవుతుంది , అంతేగాక  1994 లో అప్పటి ప్రధాని pv  నరసింహారావు గారు  ప్రపంచ వాణిజ్య మండలి లో భారత దేశాన్ని  సభ్య దేశంగా మార్చడం , సరళీకృత ఆర్ధిక విధానాలవల్ల  విలాస వస్తువుల  దిగుమతులు పెరగటం  ప్రజలంతా  స్థోమత ఉన్నా లేకున్నా వాటి వైపు ఆకర్షితులవడం , ఆనాటి  ఉమ్మడి కుటుంభ వ్యవస్థ పథనం కావడం , అనేక విషయాలలో నాటికి నేటికి వచ్చిన మార్పులో  ఆత్మహత్యల వైపు మొగ్గుచూపడం ఎక్కువయ్యింది , ఇది పరిష్కారం కాదని  అలాంటి వ్యక్తులను  చుట్టూ  సాటి  వ్యక్తులు ధైర్యాన్ని చెప్పి ఆత్మహత్యలను నిరోధించడానికి  ప్రయంతం చెయ్యాలి .

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా  ఉత్పత్తి  తక్కువగా ఉన్న పంటలకే  ధరలు బాగా వస్తున్నాయి , పప్పులన్ని  ధరలు పెరిగి కిలో  వంద రూపాయలు పైనే ఉన్నాయి , మషాలా దినుసుల పంటలైన మిర్చి , పసుపు , జీలకర్ర , అల్లం వెల్లుల్లి  మిరియాలు మొదలైన పంటల ఉత్పత్తులకు మంచి ధరలు ఉన్నాయి , అందుబాటులో ఉన్న  సామాచార సాధనల ద్వారా వాతవరణ  పరిస్తితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన పంటలను పండిస్తూ కర్చులను  ఎంత సాధ్యపడితే  అంత తగ్గించుకుంటు అప్పుల ఊబి నుంచి బైట పాడటానికి ప్రయత్నం చెయ్యవచ్చు

సెనగలు : 4500
మొక్కజొన్నలు : 13 నుండి 14  వందలు
ఆముదాలు :3500  నుండి 40 00
ఎండు మిర్చి 9500 నుండి 10 000
గోరుచిక్కుడు  25 00  నుండి ౩౦00

రానున్న season లో కేంద్ర ప్రభుత్వం  FCI  ద్వారా కొనుగోలు  చెయ్యటాన్ని  నిలిపివేసింది